• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ముగిసిన న్యాయవాదుల నిరసన

PDPL: గోదావరిఖని వన్ టౌన్ పోలీసుల తీరుకు నిరసనగా గత నెల రోజులుగా న్యాయవాదులు చేపట్టిన నిరసనలు ముగిశాయి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణతో పాటు పలు విభిన్న నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇద్దరు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు న్యాయవాదులతో జరిపిన చర్చలతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ఇకనుంచి విధులకు హాజరు కానున్నారు.

March 14, 2026 / 04:50 PM IST

నూతన ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

ఏలూరు: నగరంలోని వన్ టౌన్ 8వ డివిజన్‌లోని కొత్త రోడ్డులో శ్రీ ఆదర్శ ఆంజనేయ స్వామి వారి నూతన ఆలయ నిర్మాణ పనులకు నిర్వాహకులు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. అనంతరం ఆలయం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

March 14, 2026 / 04:48 PM IST

‘వరకట్నం తీసుకోవద్దని గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం’

ADB: సాత్నాల మండలం న్యూ టెమ్రిగూడలో కోలం తెగ కుల పెద్దలు శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. కోలం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోనేరావు, జిల్లాధ్యక్షుడు గోవింద్ రావు మాట్లాడుతూ.. తమ తెగలోని ప్రతి ఒక్కరు వరకట్నానికి దూరంగా ఉండి పలు తీర్మానాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మద్యం, మాంసానికి దూరంగా ఉండి సాంప్రదాయ బద్ధంగా వివాహాలు చేసుకోవాలని కోరారు.

March 14, 2026 / 04:47 PM IST

నందిగామలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

NTR: నందిగామ మండలం అంబారుపేటలో నిర్మించబడనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ సబ్ స్టేషన్ కీలకంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:46 PM IST

జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు..!

BHPL: జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమస్యలు తలెత్తకుండా వినియోగదారులకు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చూడటానికి జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను డిస్ట్రిబ్యూటర్ల గోదాముల నిల్వలు రోజువారీగా పరిశీలిస్తుందని కలెక్టర్ తెలిపారు.

March 14, 2026 / 04:45 PM IST

చిరుతను చంపిన ముగ్గురు అరెస్ట్

TG: మంచిర్యాలలోని కవ్వాల్ టైగర్ ఫారెస్ట్‌లో చిరుత మృతి చెందింది. ముగ్గురు నిందితులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉచ్చులో చిక్కిన చిరుతను కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. చిరుత గోళ్లు, కళేబరం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.

March 14, 2026 / 04:45 PM IST

శ్రీ సీతారామ కళ్యాణ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో జరగనున్న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రావాలని పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు ఆహ్వానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నందయ్య కోరారు.

March 14, 2026 / 04:45 PM IST

విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం గడుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను శనివారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని వర్కర్లను ఆదేశించారు.

March 14, 2026 / 04:43 PM IST

అదృశ్యం అయిన యువకుడు బావిలో శవంగా తేలాడు

హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలో విషాదం చోటుచేసుకుంది. ఈనెల 4న అదృశ్యమైన గౌతమ్ కుమార్(20) అనే యువకుడు, రాజన్న బావి సమీపంలోని పులమ్మ బావిలో శవమై తేలాడు. ట్యాంక్ బండ్ శివ టీమ్ సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 14, 2026 / 04:42 PM IST

‘పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలి’

MNCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌లో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలన్నారు.

March 14, 2026 / 04:42 PM IST

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదు: కలెక్టర్

శ్రీకాకుళంలోని మున్సిపల్ ఆఫీసులో నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు, మంచినీటి పైపులైన్లు పనుల పై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వార్డు ఎమినిటీస్, శానిటరీ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ వార్డుల్లో ఎంతవరకు పనులు జరిగాయని రిపోర్టు రూపంగా చూపించాలని ప్రశ్నించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు.

March 14, 2026 / 04:40 PM IST

పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ

KNR: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. శనివారం మొదటిరోజు కరీంనగర్‌లో ఓల్డ్ హై స్కూల్, ధన్గర్ వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.

March 14, 2026 / 04:38 PM IST

వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

KDP: సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, త్రికాలారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

March 14, 2026 / 04:38 PM IST

ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

VZM: రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత, వడగాలులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శనివారం సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువ సమయం పని చేయకుండా ఉండాలని, తరచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లాలన్నారు.

March 14, 2026 / 04:36 PM IST

పదివేల సభ్యత్వాలే లక్ష్యం: టీసీ వరుణ్

ATP: అనంతపురం గీతా మందిరంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, అహుడ ఛైర్మన్ టీసీ వరుణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, పదివేల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంనతరం ఏర్పాటుచేసిన శిబిరంలో జనసైనికులు రక్తదానం చేశారు.

March 14, 2026 / 04:36 PM IST