హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,290 తగ్గి రూ.1,69,800కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.1,55,650గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.3,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇవాళ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పడింది. దీంతో ఉదయం భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1100 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 24 పైసలు తగ్గి రూ.91.32గా ఉంది.
భారతీయ రైల్వేలో 22,195 గ్రూప్-డీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలోనూ ఖాళీలు ఉండగా.. SCR(సికింద్రాబాద్)లో 1012 ఉన్నాయి. పదో తరగతి, సంబంధిత ట్రేడులో ITI అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ చెల్లింపునకు ఎల్లుండి చివరి తేదీ కాగా, 5-14 తేదీల్లో అప్లికేషన్ సవరణ చేసుకోవచ్చు.
రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1, 3 రాత పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో జరగనున్నాయి. అభ్యర్థులు ముందుగా తమ పరీక్షా నగరాన్ని తెలుసుకునేందుకు వీలుగా బోర్డు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్ రంగంలో అర్హత కలిగిన వారు MAR 14లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను.. బయోటెక్నాలజీ&బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్-500046కు పోస్టు(ఆఫ్లైన్)ద్వారా పంపాల్సి ఉంటుంది.
తెలంగాణ పాలిసెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉందన్నారు. జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 ఫీజు కట్టాల్సి ఉంటుంది. మే 13న రాత పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాలకు polycet.sbtet.telangana.govను సంప్రదించండి.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కరోజే తులం బంగారంపై రూ.4,000 పెరిగి రూ.1,68,710 (24K)కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,650గా ఉంది. వెండి కిలోకు రూ.25,000 పెరిగి రూ.3,20,000 మార్కును తాకింది. యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు వీటిని సురక్షిత పెట్టుబడిగా భావించడంతో ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి.
అమెరికా టెక్, కార్పొరేట్ రంగాల్లో లేఆఫ్స్ భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. AI ప్రభావం, ఖర్చుల నియంత్రణ కారణంగా వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. యునైటెడ్ పార్సెల్ సర్వీస్ (78K), అమెజాన్ (30K), ఇంటెల్ (25K), మైక్రోసాఫ్ట్ (15K) వంటి దిగ్గజ సంస్థలు భారీగా సిబ్బందిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది ఉపాధిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
సైన్యంలో పనిచేసిన సిబ్బందికి కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగాల్లో మాజీ సైనికులు, అగ్నివీర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనున్నారు. మాజీ సైనికులకు లెవెల్-1 పోస్టుల్లో 20%, లెవెల్-2 ఆ పైస్థాయి పోస్టుల్లో 10%, రిటైర్డ్ అగ్నివీర్లకు లెవెల్-1 పోస్టుల్లో 10%, లెవెల్-2 ఆ పైస్థాయి పోస్టుల్లో 5% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,160 పెరిగి రూ.1,64,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,900 పెరిగి రూ.1,51,000 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
DEiEd, DPSE కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన DEECET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఆసక్తి గలవారు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 21, 22 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మార్చి 5 నుంచి వెబ్సైట్లో ఉంటాయని కన్వీనర్ రమేష్ తెలిపారు. పరీక్ష ఫీజు రూ.500. SC/ST/PwDలకు రూ.450.
అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4 శాతంతో పోలిస్తే 0.4 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.6 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా వేసింది. అలాగే జులై-సెప్టెంబర్ త్రైమానికానికి వృద్ధి రేటును 8.2 శాతం నుంచి 8.4 శాతానికి పెంచింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBIలో క్లర్క్ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్ 21న మెయిన్ పరీక్ష జరిగింది. ఈ పోస్టులకు ఎంపికైన వారి రోల్ నంబర్లతో ప్రొవిజినల్ జాబితాను SBI అధికారులు తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
మీరు చేసే ప్రతి పెద్ద లావాదేవీపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్లు, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటివి పరిమితి దాటితే బ్యాంకులు ఐటీ శాఖకు సమాచారం ఇస్తాయి. మీ ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకపోతే ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండి, రిటర్న్స్ సక్రమంగా దాఖలు చేయడం మంచిది.