NTR: కంచికచర్ల మండల ప్రభుత్వ ఖాజీగా షేక్ అబ్దుల్ రషీద్ నియమితులైన్నారు. మంగళవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయనను ఘనంగా సత్కరించారు. మైనారిటీ సోదర సోదరీమణుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్క్ బోర్డ్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ కరిముల్లా, తదితరులు పాల్గొన్నారు.
ASR: మార్చ్ 1 ఆదివారం కావడంతో ఈనెల 28న ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ జరగుతుందని అడ్డతీగల ఎంపీడీవో ఎవీవీ కుమార్ పేర్కొన్నారు. ఫింఛను లబ్ధిదారులు శనివారం వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. మండలంలో ఉన్న 5211 ఫించన్లకు రూ.2,15,48,500లు మంజూరైనట్లు మంగళవారం ఎంపీడీవో తెలిపారు. సచివాలయ సిబ్బంది ఈనెల 27న పింఛను అమౌంట్ బాంకు నుంచి విత్డ్రా చేయాలని అన్నారు.
ప్రకాశం: సీఎం చంద్రబాబు దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల శంఖస్థాపన, మార్కాపురం బహిరంగ సభ పర్యటన సందర్భంగా కనిగిరి టీడీపీ కార్యాలయంలో ప్రముఖ నేతలు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని మండల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు ఉత్సాహంగా బయటికి వచ్చారు. పరీక్షలు బాగా రాశామని సంతోషం వ్యక్తం చేశారు. రెండు పరీక్ష కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 620 మంది హాజరు కావాల్సి ఉండగా 591 మంది హాజరయ్యారు. 29 మంది గైరా హాజరైనట్లు అధికారులు తెలిపారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని గ్రీన్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం మంగళవారం ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఒకటో సచివాలయం రోడ్డులో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల మహిళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పొందవచ్చని నిర్వాహకుడు ఆదినారాయణ తెలిపారు.
ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.
ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.
VZM: మరణించిన తర్వాత కూడా జీవించాలంటే అవయవ దానం చేయాలని అఖిలభారత శరీర అవయవ దాతల సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ పిలుపునిచ్చారు. రాజాం, పొందూరు, చీపురుపల్లి కళాశాలల్లో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. అవయవ దానం ద్వారా మరికొందరికి ప్రాణాలు నిలుపవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.
E.G: “హే చాయ్ తాగరా భాయ్” అంటూ ఆనందంగా ‘టీ’ తాగే వారు నేడు జంకుతున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన ఉమ్మడి జిల్లాను వణికిస్తోంది. లాలాచెరువు ప్రాంతంలో పాలు తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, మనం తాగే టీ, కాఫీలు క్షేమమేనా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. నిత్యం చాయ్, బిస్కెట్కు అలవాటు పడిన జనం, కల్తీ భయంతో ఇప్పుడు ‘టీ’ తాగాలంటేనే భయపడుతున్నారు.
VZM: కొత్తవలస మండలం చీపురువలస గ్రామానికి చెందిన కారుకొండ నూకరాజు కూతురు ఆర్థిక స్థోమతతో కుంగిపోయింది. ఆమె కూతురు పెళ్లి విషయాన్ని తండ్రికి తెలపగా, తనతోపాటు పదోతరగతి కలసి చదువుకొన్న తోటి విద్యార్థులకు తన కూతురు బాధను స్నేహితులకు చెప్పడంతో రూ.1,20,116 నగదును సమకూర్చి వివాహా నిమిత్తం మంగళవారం అతనికి అందజేశారు.
W.G: పెనుమంట్ర-2 సచివాలయం పరిధిలో మంగళవారం 104 వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి, స్థానికులకు మధుమేహం, రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో, ఏఎన్ఎం లక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది, మేల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
కృష్ణా: మచిలీపట్నానికి చెందిన కర్ల శేషలతకు వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ.24001 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ ఈరోజు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. శేషలత వైద్య చికిత్స నిమిత్తం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారన్నారు.
SKLM: జిల్లా గ్రంథాలయ సంస్థకు పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన ఎనిమిది శాతం గ్రంథాలయ సెస్సులను విడుదల చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు కోరారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంధాలయ సంస్థలో 70 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్నారు.
PPM: జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి జీవనోపాధుల సర్వే, ప్రాజెక్ట్ ప్రాధాన్యతా పనులు, రికవరీలపై మండల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మహిళా మార్ట్ను సందర్శించి అమ్మకాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ఫైనాన్స్, మండల సిబ్బంది పాల్గొన్నారు.
KDP: రబీ వ్యవ సాయ అవసరాలకు కడప, అన్నమయ్య జిల్లాలకు 2900 టన్నుల యూరియా సోమవారం కడప రైల్వే రేక్ పాయింట్కు వచ్చింది. ఈ మేరకు వచ్చిన ఎరువులను కడప, అన్నమయ్య నంద్యాల, కర్నూలు జిల్లాకు సరఫరా చేశారు. ఇందులో కడప జిల్లాకు 2,390 టన్నులు రాగా.. ఇందులో మార్క్ఫెడ్ 1,200 టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 1,190 టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.