VSP: పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో కోట నరవ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘ప్రామిస్ ఫర్ క్లీన్ వైజాగ్’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీ. నల్లనయ్య పాల్గొని మాట్లాడుతూ.. తడి–పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.
GNTR: పెదకాకాని ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల్లోని లోపాలు, వేతన చెల్లింపుల ప్రక్రియపై అధికారులకు, వేతనదారులకు అవగాహన కల్పించారు. ఎంపీపీ శిరీష, ఎంపీడీవో, ఈవో పీఆర్డీ, ఏపీవో మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
VZM: మెంటాడ(మం) చింతలవలసకు చెందిన వైసీపీ నాయకులు, వైసీపీ ప్రచారవిభాగం సభ్యులు కనిమెరక త్రినాధరావును రాష్ట్ర YCP బూత్ కమిటీల జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు వైసీపీ అదిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై మాజీ DCM పీడిక రాజన్నదొర తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కనిమెరక త్రినాధరావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ASR: గృహ లబ్ధిదారులకు బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. బలియగూడ పీవీటీజీ గ్రామానికి చెందిన 9 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టినా బిల్లులు రాక పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ అంశంపై పాడేరు ఐటీడీఏలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
KKD: పిఠాపురం ICDS సీడీపీవో దుర్గాదేవి ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల క్యాంపెయిన్ భాగంగా రాపర్తి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత స్కూల్లో జరిగింది. చిన్న తనంలో బాల్యవివాహాల వలన శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందరని అనేక సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు. అమ్మాయికి 18 అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అన్నారు.
GNTR: మంగళగిరిలోని 6వ బెటాలియన్ APSPలో 2వ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. హోంమంత్రి అనిత అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రజా భద్రత కోసం శ్రమించే పోలీసులకు ఇలాంటి క్రీడలు అవసరమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో 6రాష్ట్రాల నుంచి మొత్తం 10 పోలీసు జట్లు పాల్గొంటున్నాయి.
CTR: పుంగనూరు బండ్లపల్లి గ్రామం సొసైటీ కాలనీలో సగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం శనివారం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. ఆదివారం అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ, కుంబాభిషేకము, మహా పూర్ణాహుతి, అలంకరణ పూజా అధికారి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
సత్యసాయి: కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ దేవానంద్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి ఆలయానికి డా.బత్తల హరిప్రసాద్ శుక్రవారం రూ.1,25,000 లక్షల విరాళం అందజేశారు. ఆయన వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఆలయ విగ్రహాలు, లోపల గ్రానైట్ బండల ఏర్పాటు కోసం ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు స్వయంగా అందజేశారు.
ATP: గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చాంబర్లో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ స్కీములపై టౌన్ ప్లానింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. నిబంధనలు పాటించి పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోనేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
NTR: మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో తాజాగా 36 మందికి రూ.16,24,276లు ఆర్థికసాయం తాజాగా మంజూరైంది. మైలవరం, గొల్లపూడి గ్రామాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు చెక్కులు రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధిని శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అన్నారు.
KDP: రాజుపాలెం(M) కొర్రపాడులో శుక్రవారం ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇందిర ఆధ్వర్యంలో గైనకాలజీ, మెడిసిన్, ఆపరేషన్ ఇతర 40 కేసులకు సంబంధించి చికిత్సలు అందించారు. పశువుల వ్యాధి నివారణకు డీ-వార్మింగ్, డీ-టికింగ్ నిర్వహించారు. పశుపోషణ, వ్యాధులపై, చికిత్సలపై రైతులకు అవగాహన కల్పించారు.
KRNL: విలువైన ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం అంటూ శుక్రవారం కర్నూలు ఆర్టీసీ డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 11,000 రెగ్యులర్ కార్మికుల పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
AKP: కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థులు శుక్రవారం పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. హెచ్ఎం సుకుమార్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు వారి చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
KRNL: ఆదోనిలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్ మాదాసుల రాజబాబు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆయన ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ASR: జాబ్ కార్డులు ఉన్నవారందరికీ ఉపాధి పనులు కల్పించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన బకులూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. నాణ్యంగా పనులు చేయాలని వేతనదారులకు సూచించారు. రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.