• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కడపలో డ్రోన్ నిఘాతో స్పెషల్ డ్రైవ్

కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో వన్ టౌన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నింగి నుంచి నిఘా ఉంచుతూ విస్తృత తనిఖీలు నిర్వహించారు.

February 20, 2026 / 05:48 PM IST

‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి’

VZM: గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అన్నారు. మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, వారు ఇచ్చే పిర్యాదులు సత్వరమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.

February 20, 2026 / 05:45 PM IST

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాయదుర్గం నేతలు

ATP: వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియమించారు. రాయదుర్గానికి చెందిన రాజకుమార్, సుదర్శన్ రెడ్డిలకు ఈ పదవులు దక్కాయి. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటంలో వీరి సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

February 20, 2026 / 05:40 PM IST

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై

కృష్ణా: పెడనలోని ఆటో డ్రైవర్లకు ఎస్సై బషీరా శుక్రవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డుపై అడ్డంగా ఆటోలను నిలిపివేయకూడదని, ప్రయాణికులను ఎక్కించడం, దించడం కోసం విశిష్ట ప్రదేశాలను మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. స్కూల్ పిక్ సమయాలలో రోడ్లపై క్రమశిక్షణ పాటిస్తూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా సహకరించాలన్నారు.

February 20, 2026 / 05:40 PM IST

మున్సిపాలిటీ సిబ్బందికి క్షయ వ్యాధిపై అవగాహన

NDL: డోన్ మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం సిబ్బంది, శానిటరీ వర్కర్లకు క్షయ (టీబీ) వ్యాధిపై అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సల్మాకాతుమ్, సూపర్వైజర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఛాతి ఎక్సరే, స్పిరోమీటర్ పరీక్షల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. కొత్త రోగులను గుర్తించేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయని వారు తెలిపారు.

February 20, 2026 / 05:39 PM IST

రేపు వినుకొండలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..!

PLD: సీఎం చంద్రబాబు శనివారం వినుకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా వినుకొండ చేరుకుంటారు. అక్కడ ‘స్వచ్ఛ రథాన్ని’ ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

February 20, 2026 / 05:39 PM IST

ఏసీబీ అధికారుల సోదాలు అప్డేట్

ప్రకాశం: కంభం వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ తన ఇంటిలో రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన విషయం తెలిసిందే. అయితే కంభం మండలం తురిమెళ్ళ గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయంలోను అధికారులు సోదాలు నిర్వహించారు.

February 20, 2026 / 05:38 PM IST

ఏజీపీగా పైడి వరహా నరసింహులు నియామకం

SKLM: ఆమదాలవలస(మం) కత్యచార్యులపేటకు చెందిన పైడి వరహా నరసింహులు ఆమదాలవలస సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టులో ప్రభుత్వం న్యాయవాది(ఏజీపీ)గా సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. ఈయన పలుమార్లు ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. ఈయనకు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

February 20, 2026 / 05:38 PM IST

TDP నుంచి వైసీపీలో చేరిన 20 కుటుంబాలు

KDP: నందవరం మండలంలోని మాచపురం గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. టిడిపికి చెందిన 20 కుటుంబాలు శుక్రవారం వైసీపీ పార్టీలో చేరారు. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో పలువురు TDP గ్రామ నాయకులు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని తెలిపారు.

February 20, 2026 / 05:38 PM IST

‘మహిళలపై అరాచకాలకు పాల్పడితే చర్యలు తప్పవు’

W.G: మైనర్ బాలికలు, మహిళలపై దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం డీఎస్పీ డా. జి. శ్రీవేద స్పష్టం చేశారు. మహిళల రక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యమని, నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని ఆమె హెచ్చరించారు. మహిళలపై జరిగే నేరాల పట్ల ఏ మాత్రం రాజీ పడకుండా బాధ్యులపై కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.

February 20, 2026 / 05:36 PM IST

మూతబడిన పీఏసీఎస్ కార్యాలయం

AKP: ఉద్యోగుల సమ్మెతో కోటవురట్ల పీఏసీఎస్ కార్యాలయం మూతపడింది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు.హెచ్ఆర్ పాలసీని, జీవో36ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ వయసు 62కు పెంచాలని సమ్మెకు దిగారు.

February 20, 2026 / 05:32 PM IST

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్

BPT: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 7,443 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, ప్రైవేట్ షాపుల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధరను రూ. 266.50గా నిర్ణయించామని, ఎవరైనా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

February 20, 2026 / 05:32 PM IST

‘ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

పార్వతీపురం ఐటీడిఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొమరాడ మండలంలో ఉన్న పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.

February 20, 2026 / 05:25 PM IST

కోట నరవ హైస్కూల్లో ‘ప్రామిస్ ఫర్ క్లీన్ వైజాగ్’

VSP: పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో కోట నరవ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘ప్రామిస్ ఫర్ క్లీన్ వైజాగ్’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీ. నల్లనయ్య పాల్గొని మాట్లాడుతూ.. తడి–పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.

February 20, 2026 / 05:24 PM IST

పెదకాకానిలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక

GNTR: పెదకాకాని ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల్లోని లోపాలు, వేతన చెల్లింపుల ప్రక్రియపై అధికారులకు, వేతనదారులకు అవగాహన కల్పించారు. ఎంపీపీ శిరీష, ఎంపీడీవో, ఈవో పీఆర్డీ, ఏపీవో మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:21 PM IST