కడప: దేశవ్యాప్తంగా వైట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు సరుకులు అందుతాయి. అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఉచిత రేషన్ పొందాలంటే కుటుంబ సభ్యులందరూ ఈ -కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఈ మేరకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ -కేవైసీని ఫిబ్రవరి 28వ తేదీ లోపు పూర్తి చేయకపోతే ఉచిత రేషన్ నిలిపివేయబడుతుంది.
E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం ఏకగ్రీవం అయ్యాయి. అధ్యక్షునిగా చిక్కాల సూరిబాబు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ లు, కార్యదర్శిగా అన్నందేవుల సూర్యచంద్రరావు, కోశాధికారిగా కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం, సలహాదారుడిగా పళ్ళ వెంకటగిరిను ఎన్నుకున్నారు.
KRNL: మద్దికేర మండల ప్రజలకు శనివారం ఎస్సై హరిత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. జిల్లా పరిసరాల్లో ఇళ్ల దొంగతనాలు, వాహనాల చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్లో చైన్ దొంగతనం జరిగినట్లు పేర్కొని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేయాలని సూచించారు.
అన్నమయ్య: రాజంపేట మండల పరిధి బోయినపల్లిలోని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ కుమార్ రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటి, బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
TPT: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్కు పలు ప్రాంతాల ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. సంబంధిత ఆర్జీలను అధికారులకు పంపి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
VZM: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెల్లడించారు. కొండవెలగాడ-విజయనగరం రహదారి రిసర్ఫేసింగ్ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూ.1.75 కోట్లతో ఈ రహదారి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంతోనే పారదర్శక పాలన సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గదల అచ్చంనాయుడు, యడ్ల గోవిందరావు పాల్గొన్నారు.
SKLM: పవిత్ర ఖురాన్ అవతరించిన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం అనేది ఆత్మశుద్ధి, సహనం, దాతృత్వం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ATP: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాక్షస ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వరుని వేడుకున్నానని తెలిపారు.
W.G: శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానించారని మండిపడ్డారు.
NDL: బనగానపల్లె మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరి మాత శనివారం విశేష పుష్పలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చన, రుద్రాభిషేకం నిర్వహించారు. యాగంటి ఉమామహేశ్వరస్వామి అమ్మవార్లకు కూడా ఆలయ ఈఓ డి.పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో గణపతి పూజ, జలపాల పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
ELR: భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఆన్ లైన్ పెట్టుబడులు, లాభాలు అనే రెండు బూటకపు మాటలను తిప్పి కొట్టాలని ఎస్సై మదీనా భాష సూచించారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. క్రిప్టో కరెన్సీ అనే కుంభకోణంలో ఎంతో మంది కుదేలయ్యారన్నారు. అమాయకులే టార్గెట్గా సైబర్ మోసాలు జరుగుతాయని, మోసానికి గురైతే నం.1930 ఫోన్ చేయాలన్నారు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయొద్దన్నారు.
VSP: GVMC పరిధిలో సర్వేయర్లపై దోపిడీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ భూముల వివరాలు, సర్వే సర్టిఫికెట్లు, వీఎల్టీ, ప్లాన్ మంజూరులు వంటి పనుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. పనిని బట్టి రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. పాల్గుణ మాసం శుద్ధ చవితి కావడంతో స్వామి వారు ప్రత్యేక పుష్పాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాద ఏర్పాట్లు చేశారు.
PPM: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని AITUC జిల్లా కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం పార్వతీపురంలోని స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితుల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు హాజరవుతారని పేర్కొన్నారు.
సత్యసాయి: లేపాక్షి మండలం చోళసముద్రం టోల్ ప్లాజా సమీపంలో హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర ఆధ్వర్యంలో శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు.హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను గుర్తించి వారికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించి, అక్కడికక్కడే కొత్త హెల్మెట్లు కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టారు.