BPT: కొల్లూరు మండలం వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7,87,294లు మంజూరయ్యాయి. మొత్తం 17 మంది లబ్ధిదారులకు చెక్కుల రూపంలో ఈ సహాయాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా అందజేశారు. పేదల వైద్య అవసరాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్సై ఎం. అప్పలరాజు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు.
CTR: వెదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణ-ఆంధ్ర, స్వచ్ఛ-ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి ప్రారంభించారు. తహసీల్దార్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలు ఇంట్లో అవసరం లేని వస్తువులను ఇచ్చి అవసరమైనవి పొందవచ్చని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
PLD: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, దేవస్థాన అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ఎన్టీఆర్: కంచికచర్లలోని చెవిటికల్లు సెంటర్, నెహ్రూ సెంటర్, జుజ్జూరు రోడ్డు సెంటర్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ఆటోవాలాలు ఇష్టాను సారంగా రోడ్లపై వాహనాలను నిలిపి ఉంచడంతో మిగిలిన వాహనదారులు గందరగోళానికి గురవుతున్నామంటున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
VSP: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ‘జీరో–వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుంచి కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు.
E.G: కొవ్వూరులో శనివారం జరిగిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించి స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్: దేవుడు చిత్రపటాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం అత్యంత దుర్మార్గమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సత్యసాయి: పరిగి మండలంలో స్వచ్ఛ రథాన్ని శనివారం ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్యంపై అవగాహన, చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ స్వచ్ఛ రథాన్ని ప్రవేశపెట్టినట్లు టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి తెలిపారు. ప్రజలు వేస్ట్ ప్లాస్టిక్ వస్తువులు ఈ వాహనానికి అందిస్తే నిత్యవసర వస్తువులు అందిస్తారని తెలిపారు.
ATP: రాయదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి వైసీపీ పార్టీ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడిగా తోట రాజును ఎన్నుకున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గొప్ప బాధ్యతలు అప్పగించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ సమన్వకర్త మెట్టు గోవిందరెడ్డికి, వార్డు కౌన్సిలర్ సంజీవప్పకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
TPT: స్వచ్ఛంద్ర–స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. శనివారం పిచ్చాటూరు ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛ రథాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలు వినియోగించిన ప్లాస్టిక్, గాజు సీసాలను రథానికి అందిస్తే నిత్యావసర వస్తువులు ఉచితంగా పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
VSP: యెద్దుల వెంకటరమణ రెడ్డికి చెందిన శాన్విరా ఇండస్ట్రీ లిమిటెడ్ గోడౌన్ను అధికారులు సీజ్ చేశారు. జీవీఎంసీకి సుమారు రూ.1.90 కోట్లు ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందుగా నోటీసులు జారీ చేశారు. అయితే సంబంధిత సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శనివారం రెవెన్యూ అధికారి రామ్ నారాయణ ఆధ్వర్యంలో ఆచ్ఐలు శివ, రెడ్డి మోహన్ పాల్గొన్నారు.
CTR: రొంపిచర్ల మండలం బొమ్మయ్యగారి పల్లెలో స్వచ్ఛ రథాన్ని పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు రెడ్డి ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించిన వాహనాన్ని డంపింగ్ యార్డ్ వరకు నడిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లాలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది శ్రమదానంలో పాల్గొని ప్రాంగణాలను శుభ్రం చేశారు.
కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై చర్యలు తీసుకోవాలని సఖినేటిపల్లి మండలం ఎస్సీ వెల్ఫేర్ సభ్యులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఎస్సై దుర్గా శ్రీనివాస్కు ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షుడు ప్రతాప్ పిర్యాదు చేశారు. మందకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.