ATP: ఉరవకొండలో గవిమఠం శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం పీఠాధిపతిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. రథోత్సవానికి తరలివచ్చిన భక్తులతో ఆయన ముచ్చటించారు.
KDP: ముద్దనూరు పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆరోగ్యం-భవిష్యత్తుపై ప్రభావం, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో డ్రగ్ ఫ్రీ జీవనం గడపాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
KRNL: కోసిగి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరేణుకా యల్లమ్మ ఆలయాన్ని శనివారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NLR: సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకువెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం(M) గజ్జలవారిపల్లికి విద్యార్థులు రోడ్డు లేదని SM ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్ను సృష్టిస్తుంది.
నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ నుండి సంజీవ నగర్ సర్కిల్ వరకు జరుగుతున్న రహదారి పనుల వల్ల ఇవాళ తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) నేతలు అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మళ్లించాలని కోరారు. పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
SKLM: క్రీడలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతి ఇస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం సాయంత్రం ఆమదాలవలస మున్సిపాలిటీ జగ్గు శాస్త్ర పేట గ్రామం వద్ద ఉన్న ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సౌత్ జోన్ నేషనల్ సాఫ్ట్ బాల్ కోచింగ్ క్యాంపెయిన్ను స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
TPT: చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలోని మీటింగ్ హాల్లో అధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సమీక్షించారు. జాతరకు నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు.
VSP: గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతులు శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి జే. వెంకట్రావు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు వేదపండితులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం అందించారు.
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామంలో బస్స్టాప్ నుంచి పాఠశాల వరకు జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఒంగోలు ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో, నిర్దేశిత కాలపట్టికలో పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
VZM: నెల్లిమర్ల నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేర్కొన్నారు. శనివారం “కొండవెలగాడ – విజయనగరం కుమ్మరవీధి రోడ్ రిసర్ఫేసింగ్” పనులకు ఆమె శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. గత కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకంగా ఉన్న ఈ రహదారిని పునరుద్ధరించడం తన ప్రాధాన్యత అని తెలిపారు.
E.G: నల్లజర్ల మండలం కృష్ణమ్మగూడెం గ్రామంలో ‘స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛాంద్ర వాహనాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని తెలిపారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యమని పేర్కొన్నారు.
ATP: అనంతపురం నగరంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ-వేస్ట్ పర్యావరణానికి ప్రమాదకరం కాకూడదని తెలిపారు. మార్కెట్ పరిశుభ్రంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
KKD: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా అన్ని కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP జి. బిందు మాధవ్ శనివారం తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే పరీక్షల్లో డ్రోన్, సోలార్ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. DHMD, HHMDలతో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
CTR: చిత్తూరులో త్వరలో రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి పాల్గొన్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ ృమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని కొండపేట కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.