E.G: ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి సమయానికి పరీక్షలకు హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని జిల్లా ఎస్పీ డీ. నరసింహ కిషోర్ శనివారం సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ నిఘా ఉంటుందన్నారు.
NDL: ఉయ్యాలవాడ మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి శనివారం తెలిపారు. ఈ నెల 24 నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 ఫీజు. ఏప్రిల్ 27న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు.
W.G: కాళ్ళ మండలం ప్రాతల్లమెరక గ్రామంలో వేగిరాజు శివవర్మ ఆధ్వర్యంలో రూ 3 కోట్ల వ్యయంతో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, బాపట్ల ఎంఎల్ఏ , APIIC ఛైర్మన్ మంతెన రామరాజు ప్రారంభోత్సవం కార్యక్రమంలో వారు పాలుపంచుకున్నారని ఆయన తెలిపారు.
సత్యసాయి: తలుపుల మండలం మంగివాండ్లపల్లిలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. సమస్యలను నేరుగా ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వాటికి త్వరితగతిన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
KRNL: మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ శనివారం ప్రకటించింది. 2018లో తీసుకున్న రుణం వడ్డీతో కలిసి రూ.782 కోట్లకు చేరగా, చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. KPHBలోని మెరిడియన్ పాఠశాల భవనం, స్థలాన్ని మార్చి 24న వేలం వేయనున్నారు. కనీస విలువను రూ.65 కోట్లుగా నిర్ణయించారు.
ATP: గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలోని ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు CMRF చెక్కులను శనివారం టీడీపీ నేతలు పంపిణీ చేశారు. మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు ఇంటి వద్దకే వెళ్లి ఒకరికి రూ.72,650వేలు, మరొకరికి రూ.45 వేలు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం అన్నారు.
కృష్ణా: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నంలోని బస్టాండ్ను మంత్రి కొల్లు రవీంద్ర శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మంత్రి కాసేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, డీఎం పెద్దిరాజులు పాల్గొన్నారు.
BPT: కొల్లూరు మండలం వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7,87,294లు మంజూరయ్యాయి. మొత్తం 17 మంది లబ్ధిదారులకు చెక్కుల రూపంలో ఈ సహాయాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా అందజేశారు. పేదల వైద్య అవసరాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్సై ఎం. అప్పలరాజు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు.
CTR: వెదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణ-ఆంధ్ర, స్వచ్ఛ-ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి ప్రారంభించారు. తహసీల్దార్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలు ఇంట్లో అవసరం లేని వస్తువులను ఇచ్చి అవసరమైనవి పొందవచ్చని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
PLD: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, దేవస్థాన అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ఎన్టీఆర్: కంచికచర్లలోని చెవిటికల్లు సెంటర్, నెహ్రూ సెంటర్, జుజ్జూరు రోడ్డు సెంటర్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ఆటోవాలాలు ఇష్టాను సారంగా రోడ్లపై వాహనాలను నిలిపి ఉంచడంతో మిగిలిన వాహనదారులు గందరగోళానికి గురవుతున్నామంటున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
VSP: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ‘జీరో–వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుంచి కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు.
E.G: కొవ్వూరులో శనివారం జరిగిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించి స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్: దేవుడు చిత్రపటాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం అత్యంత దుర్మార్గమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.