CTR: కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ మల్లేష్ యాదవ్, తన సిబ్బందితో కలిసి కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. క్రమశిక్షణ, నైతిక విలువలను బలోపేతం చేయడం, లక్ష్య సాధనకు ప్రేరణ, సైబర్ అవగాహన, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై మార్గ నిర్దేశం చేశారు. యువత చదువు పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనలు కలిగి ఉండాలని నొక్కి చెప్పారు.
CTR: పాలసముద్రంలోని అరుణోదయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఎస్సై రాజశేఖర్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. పోక్సో చట్టం శిక్షలు, పొగాకు వాడకం యొక్క ప్రభావాలు, మాదకద్రవ్యాలు ధైర్య స్పర్శ కార్యక్రమం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ మోసాలకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
W.G: చేనేత రంగాన్ని కాపాడుకోవడానికి, నేతన్నల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 22న మంగళగిరిలో నిర్వహించ తలపెట్టిన చేనేత గర్జనను విజయవంతం చేయాలని చేనేత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనిలో భాగంగా శుక్రవారం నరసాపురం 25వ వార్డు వీవర్స్ కాలనీలో నేతలు పర్యటించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
W.G: సమాజంలో శాంతి, భద్రత, శ్రేయస్సు వర్ధిల్లాలంటే సామాజిక న్యాయం ఎంతో అవసరమని లీగల్ సర్వీసెస్ సభ్యులు వై.డి. ఫణికర్, ప్యానెల్ లాయర్ కె. శిరీష పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లింగబోయిన చర్ల గ్రామ సచివాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో పిల్లలు సోషల్ మీడియా మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
అన్నమయ్య: పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అన్నా క్యాంటీన్లు, మునిసిపల్ సేవలు, పారిశుద్ధ్యం, శాంతిభద్రతలపై సమీక్ష జరిగింది. పథకాల అమలు సజావుగా కొనసాగాలని సీఎస్ సూచించారు.
CTR: CMRF పేదల వైద్య సేవలకు ఆర్థిక భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శుక్రవారం నియోజకవర్గానికి సంబంధించి 24 మంది లబ్ధిదారులకు రూ.35,35,182 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా CM చంద్రబాబు CMRF ద్వారా పేదలను ఆదుకుంటున్నారని చెప్పారు. వైద్య సేవల కోసం అప్పులు చేయకుండా ఆర్థిక సాయం అందిస్తునారని తెలిపారు.
PPM: సహకార సొసైటీల సిబ్బంది న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ అన్నారు. శుక్రవారం DCCB కార్యాలయం వద్ద PACS ఉద్యోగులతో నిరసన తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం 30, 40 సంవత్సరాలుగా PACSలలో ఉద్యోగులుగా పని చేస్తున్న వారందరికీ న్యాయం చేయాలన్నారు. ఉద్యోగులందరికీ తక్షణమే జీవో నంబర్ 36 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
GNTR: తెనాలి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్ను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శుక్రవారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించి, భోజనం చేస్తున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పుడూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని, క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
ప్రకాశం: మర్రిపూడి మండలంలో రైతులు ప్రధానంగా పొగాకు, కంది సాగుచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నీటి వనరులు ఉన్న రైతులు బొప్పాయి పంట వైపు మొగ్గు చూపిస్తున్నారు. మండలంలో దాదాపు 500 ఎకరాలకుపైన బొప్పాయి పంట సాగులో ఉందని అధికార యంత్రాంగం తెలిపింది. నీటి వనరులు ఉంటే బొప్పాయి పంట లాభదాయకంగా ఉంటుందని రైతులు తెలిపారు.
సత్యసాయి: పరిగి మండలం 11కేవీ పెద్దిరెడ్డిపల్లి ఫీడర్లో శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు 11కేవీ లైన్ క్రింద మంటలు పెట్టడంతో ఈ అంతరాయం ఏర్పడినట్లు పరిగి ఏఈ సంజీవప్ప తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. త్వరలో విద్యుత్ సరఫరా చేస్తామని ఏఈ తెలిపారు.
NLR: తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరులోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరినొకరు నిందించుకోవడం కాకుండా, జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాలని సూచించారు.
కోనసీమ: ఆలయాల అభివృద్ధికి పాలకమండళ్లు విశేషంగా కృషి చేయాలని కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రావులపాలెం మండలం లక్ష్మిపోలవరం గ్రామంలో శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణస్వీకారం మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
E.G: రాజమండ్రి రూరల్ కొంతమూరులో నడి రోడ్డుపై మూగజీవులు సంచారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆవులు ప్రమాదకరంగా నడిరోడ్డుపై తిష్ట వేయడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎయిర్పోర్ట్, కోరుకొండ ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతాయి. ఎటువంటి ప్రమాదాలు జరుగగా ముందే నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ATP: గార్లదిన్నె మండలంలో సింగరప్ప స్వామి తిరునాల సందర్భంగా ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు జరుగుతాయని గ్రామస్తుల శుక్రవారం తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈనెల 21న న్యూ కేటగిరి విభాగానికి పోటీలు ఉండగా, 22న సీనియర్ కేటగిరి విభాగానికి పోటీలు జరుగుతాయన్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు.