శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.
శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.
KDP: ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
GNTR: ఆత్మహత్యలకు కారణమవుతున్న ‘పారాక్వాట్’ గడ్డిమందును నిషేధించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్లో ఆమె మాట్లాడారు. ఇది సైలెంట్ కిల్లర్గా మారిందని, 5 ఎంఎల్ తాగినా ప్రాణాలు పోతున్నాయన్నారు. దీనికి ఎలాంటి విరుగుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, పంజాబ్ తరహాలో ఏపీలోనూ ఈ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కోరారు.
BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు ఎస్.టి. యానాది కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం ఉదయం ఇంటింటికీ తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. శాంతిభద్రతల కోసం తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
BPT: వేదుళ్లపల్లి పరిధిలోని స్టువర్టుపురంలో ఎస్సై భాగ్యరాజు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మన్యం లక్ష్మి అనే వ్యక్తి నుంచి 4 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. నాటు సారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని ఎస్ఐ సూచించారు.
AKP: టీటీడీకి చెందిన నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలకు గురువారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవాలకు ప్రారంభ సూచికగా ఉత్సవ కావిడితో తిరువీధి సేవ నిర్వహించారు. సాయంత్రం విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం కంకణ ధారణ, అంకురార్పణ, గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.
KRNL: దేవనకొండ(M) కరివేముల గ్రామ శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి రూ.15,000 విరాళం అందించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాముని పరిపాలన ప్రపంచానికే ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్.కె. శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లు మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాస్కోడిగామా వరకు వెళ్లే షాలీమార్, తిరుపతి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లను ఏప్రిల్ నుంచి జూన్ వరకు హుబ్లీ స్టేషన్ వరకే పరిమితం చేశామని అన్నారు. హుబ్లీ-వాస్కోడిగామా మధ్య ఈ రైళ్లు నడవవని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని కోరారు.
NLR: తెలుగుదేశం పార్టీ నెల్లూరు మేయర్ అభ్యర్థిగా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఖరారు అయ్యారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ఆమె పేరును అధికారికంగా గురువారం ప్రకటించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో సుజాతను పరిచయం చేశారు.
SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, తదితరులు బుధవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో కలుసుకున్నారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. డయేరియాతో చనిపోయిన వారి సంఖ్య ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
KDP: బ్రహ్మంగారిమఠం మఠాధిపతి వెంకటాద్రి స్వాముల వారి పట్టాభిషేకం మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను గురువారం సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ఎస్సై శివప్రసాద్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై వివరించారు. ప్రత్యేక దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
SS:పెద్దవడుగూరు మండలంలోని పలు గ్రామాల్లో జింకల బెడద అధికమవుతోంది. మందగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. పెద్దవడుగూరు, చిన్నవడుగూరు, దిమ్మగుడి, నాగలాపురం, గుత్తిఅనంతపురం, విరుపాపురం, ఆవులాంపల్లి, మల్లేనిపల్లి, బందార్లపల్లి, తదితర గ్రామాల సమీపంలో రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. పంట పెట్టుబడి కూడా చేతికి అందని పరిస్థితి దాపురించిందన్నారు.
నంద్యాల పట్టణంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇవాళ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనకై ప్రతి ఒక్కరూ మార్చి 1న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.
VZM: కొత్తవలస మండల తహసీల్దార్గా ఎస్. రమాలక్ష్మీ గురువారం ఇన్ఛార్జ్ తహసిల్దార్ పీ.సునీత నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడికి రాకముందు రాష్ట్ర ప్రధాన భూపరిపాలన విభాగంలో పనిచేస్తూ కొత్తవలసకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు మండల తహసీల్దార్ గా విధులు నిర్వహించిన అప్పలరాజు కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. భూసమస్యలపై దృష్టి సారిస్తానని రమాలక్ష్మీ చెప్పారు.