»Union Minister Ashwini Vaishnaw Sensational Comments On Former Rbi Chief Raghuram Rajan
RBI Chief Raghuram rajanపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
మంచి ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులుగా మారినప్పుడు, వారు తమ ఆర్థిక స్పృహను కోల్పోతారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(ashwini vaishnaw)..భారత మాజీ ఆర్బిఐ చీఫ్ రఘురామ్ రాజన్(Raghuram rajan)కు కౌంటర్ ఇచ్చారు. ఎవరి తరపునో ఉంటూ చాటుగా మాట్లాడటం కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
Union Minister ashwini vaishnaw sensational comments on former RBI Chief Raghuram rajan
భారత మాజీ ఆర్బిఐ(RBI) చీఫ్ రఘురామ్ రాజన్(Raghuram rajan)పై కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్(ashwini vaishnaw) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ఆర్థికవేత్తలు రాజకీయ నేతలు అయినప్పుడు, వారి ఆర్థిక పరిజ్ఞానం తక్కువగా ఉంటుందని రఘురామ్ రాజన్ గురించి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇండియా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(PLI) కింద మొబైల్స్ తయారు చేయడం లేదని రఘురామ్ రాజన్ ఇటివల వ్యాఖ్యలు చేశారు. కేవలం విడిభాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ మొబైల్స్ తయారు చేస్తున్నట్లు రఘురామ్ రాజన్ అన్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.
ఈ క్రమంలో రఘురామ్(Raghuram) ఎవరీ తరఫునో మాట్లడటం కాకుండా బహిరంగంగా బయటకు రావాలని.. ఎన్నికల్లో పోటీ చేయాలని కేంద్రమంత్రి సూచించారు. దీంతోపాటు రాజకీయ మోసాల్లో పాలుపంచుకోవాలని అశ్వి వైష్ణవ్ సలహా ఇచ్చారు. ఇలాంటి క్రమంలో ఉంటే రాజకీయ నేతగా ఉండండి. లేదా ఆర్థిక వేత్తగానైనా ఉండాలని హితవు పలికారు. అంతేకాదు ఈ పద్ధతిపై వ్యాఖ్యానించే అర్హత రఘురామ్ రాజన్కు లేదన్నారు. కొన్ని నెలల క్రితం రాహల్ గాంధీ నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా యాత్ర రాజస్థాన్ చేరుకున్న క్రమంలో రఘురామ్ రాజన్ ఒక దశలో రాహుల్ తో కలిసి నడిచారు.
వచ్చే రెండేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ 30 శాతం వృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి(central minister) ఆశా బావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్లకు అవసరమైన 3 కంపెనీలు ఇండియాలోనే తయారు చేయనున్నట్లు వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీని ప్రారంభించిన చాలా దేశాలు పూర్తిగా నాక్డ్-డౌన్ (CKD) భాగాలు, సెమీ-నాక్డ్-డౌన్ (SKD)ని ఉపయోగిస్తున్నాయని గుర్తు చేశారు. పరిశ్రమలను రక్షించడమే కాకుండా, ఉత్పత్తిని పెంచే మార్గాన్ని ఎంచుకున్నామని వైష్ణవ్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఇది ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.