KRNL: ఉమ్మడి జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో హ్యాండ్ పంపులను సిద్ధం చేయడం, సుజల స్రవంతి మదర్ ప్లాంట్లను పనిలోకి తీసుకురావడం, తాగునీటి వనరులు లేని గ్రామాలకు నీరు అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.