ఏరికోరి అదే రోజు ఆవులను ప్రేమిద్దాం అని పిలుపునివ్వడం రాజకీయంగా వివాదం రేగింది. మతపరమైన అంశాల జోలికి వెళ్లడంతో వివాదాస్పదమవుతున్నది. ఆ రోజు జంటగా ఎవరూ కనిపించినా దాడులు చేస్తామని ఇప్పటికే పలు సంఘాలు ప్రకటించాయి. ప్రేమికుల రోజు పాశ్చాత్య సంస్కృతి అని, దాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
బారికేడ్లను తోసేసి వాహనదారులు ట్రాక్ పైకి వచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ట్రాక్ పైకి ఇతర వాహనాలు రావడంతో రేసింగ్ ప్రాక్టీస్ ను వాయిదా వేశారు. ట్రాక్ పై సెక్యూరిటీ లోపం ఉండటంతో...
సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టగా అందులో తారకరత్న కూడా పాల్గొన్నారు. ఆ పాదయాత్రలోనే తారకరత్న(Taraka Ratna) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీలో జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యామ్నాయ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు పలికారు.
Bandi Sanjay : తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే... సచివాలయం డోమ్స్ కూలగొడతామని ఆయన పేర్కొన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే... కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మార్పులు చేస్తామని ప్రకటించారు.
Pocharam Srinivas Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నేడు 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాగా..ఆయన తన బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మృతివార్త తెలిసి స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య మిత్రుడిని తలుచుకుంటూ పుట్టిన రోజు నాడే పోచారం క...
Hyderabad : Key update in Viveka murder case
కొత్తగా జే ట్యాక్స్ (J Tax) అనే వాటికి భయపడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని వ్యాపారులు తెలిపారు. కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగ యువత హైదరాబాద్ (Hyderabad), బెంగళూరుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలు, అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం జరిగిన పరిణామాలపై ‘జగనాసుర రక్తచరిత్ర’ పేరిట పుస్తకం తీసుకువచ్చింది. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే దానిపై సవివరంగా పుస్తకం రూపొందించినట్లు తెలిపారు.
MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశంలో కూడా సుపరిపాలన అందిస్తారని అన్నారు. తెలంగాణలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నార...
Revanth Reddy : ప్రగతి భవన్ పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్... డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాగా... దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన గులాబీ నేతలకు కౌంటర్ గా ఆయన కూడా డీజీపీకి కంప్లయింట్ చేశారు.
నారా లోకేష్ అతి కష్టంగా పాదయాత్ర చేయడం చూస్తుంటే తనకు చాలా బాధ వేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను ముంబయి వర్లీలోని త్రీ సిక్స్టీ వెస్ట్లో వ్యాపార వేత్త వెల్స్పన్ గ్రూప్ అధినేత B K గోయెంకా 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు
పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
దేశంలో గత 11 ఏళ్లలో 16 లక్షల 60 వేల మంది భారతీయులు తమ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు జై శంకర్ రాజ్యసభలో తెలిపారు. ఆప్ పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.