మీకెప్పుడైనా పెళ్లి కావాలని పాదయాత్ర చేస్తున్నారనే వార్త తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కర్ణాటక మాండ్యా జిల్లాలో దాదాపు 250 మంది యువకులు తమకు వధువు కావాలని ఫిబ్రవరి 23న పాదయాత్ర చేయనున్నారు. 106 కిలోమీటర్లు ప్రయాణించి శైవక్షేత్రమైన మలే మహదేశ్వర కొండల వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.
ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను ప్రకటించిన సీఎం కేసీఆర్..ఈ ఆలయ అభివృద్ధి పనుల రూపకల్పన, పరిశీలన కోసం ఈనెల 14న కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు.
యాదగిరిగుట్ట నుండి తిరుపతి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో పదిహేను మంది గాయపడ్డారు.
తిరుపతి వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు(TSRTC Bus) 44వ జాతీయ రాహదారి పరిధిలో పల్టీ కొట్టింది. ఘటనలో సుమారు 15 మందికి గాయాలు కాగా, ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ( Viḍudala rajinī) గురించి సోషల్ మీడియలో ఒక ఆసక్తికర వార్తా చక్కర్లు కొడుతొంది. అదేంటంటే ..ఆమె సినిమా ఇండస్ట్రీలోకి( Film industry) ఎంట్రీ ఇవ్వనున్నారట.
గుజరాత్ లోని సూరల్ జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూపంకం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు తెలిపారు.
గూగుల్ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న ఫేక్ వైద్యుడు సెంబియన్(31)ని తమిళనాడులో అరెస్టు చేశారు. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదవిన సెంబియన్ తన పేరుమీద ఉన్న నిజమైన డాక్టర్ ప్రొఫెల్ మార్చి డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలోనే రెండు సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అప్పుడు కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన పత్రాలు దహనమయ్యాయి. అప్పుడు ఆ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. తాజాగా జరిగిన ప్రమాదంలో మరికొన్ని పత్రాలు మంటల్లో కాలిపోయాయి. ఏ పత్రాలు తగలబడ్డాయో ఇంకా తెలియరాలేదు.
ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలు పక్కన పడేసి మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ముందే అభివృద్ధిలో వెనుకబడిన గోషామహల్ పై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యాడు.
నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) గత ఐదేళ్లలో ఐదు ప్రాంతాల్లో గృహాల(houses)ను కొనుగోలు చేసిన వార్తలపై స్పందించారు. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. కానీ అదే వార్త నిజమైతే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజా సింగ్ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతర వర్గాలను కించపరుస్తూ, దూషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ద్వారా ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. దీనికి ప్రభుత్వం స్పందించి అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఒక ఎమ్మెల్యేపై పీడీ చట్టం ప్రయోగించడం బహుశా దేశంలో మొదటిసారి కావొచ్చు.
నందమూరి కుటుంబానికి (Nandamuri Family) రోడ్డు ప్రమాద గండం ఉందని కనిపిస్తోంది. ఈ కుటుంబసభ్యులు తరచూ రోడ్డు ప్రమాదాలకు (Road Accident) గురవుతున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో ఇప్పటికే నందమూరి కుటుంబం చాలా విషాదాలు ఎదుర్కొన్నది.
అమెరికా ఫైటర్ జెట్-22 అలాస్కా మీదుగా ఎత్తుగా ఎగురుతున్న గుర్తు తెలియని ఓ వస్తువును కూల్చివేసిందని వైట్ హౌస్ శుక్రవారం తెలిపింది. 40,000 అడుగుల ఎత్తులో తేలుతున్నందున అది పౌర విమానయానానికి ముప్పుగా పరిణమించినందున ఆ వస్తువును కూల్చివేశామని వెల్లడించారు.
Janasena Party : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు.... జనసేనలో చేరబోతున్నారా..? అవుననే ప్రచారమే జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రచారం ఊపందుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. జనసేన పార్టీ ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో కనిపించడమే దీనికి కారణం కావడం గమనార్హం.