SKLM: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం రాత్రి జలుమూరు మండలం నారాయణ వలస సంత నుంచి ఆలమండకు అక్రమంగా రవాణా అవుతున్న 14 పశువులతో వెళుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రమంలో పశువులను టెక్కలి లోని భవానీపురం గోశాలకు తరలించామని పేర్కొన్నారు.