కృష్ణా: మల్లాయిపాలెంకు చెందిన ఓ వృద్ధుడు మిల్లులో కూలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సైకిల్పై రైస్ మిల్లు వైపు వెళ్తుండగా ముదినేపల్లి వైపు నుంచి వస్తున్న ఓ బైకును గమనించి భయంతో సైకిల్ అదుపు కోల్పోయి రోడ్డుపై పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఈరోజు మృతి చెందాడు. అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.