సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శంభులింగేశ్వర ఆలయ వెనుక మహిళ మృతదేహాం లభ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మండలంలోని నందికంది గ్రామానికి చెందిన సారలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి తలకు గాయం ఉండడంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.