NLR: మనుబోలు మండల పరిధి అప్పయ్యగేటు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డైవర్తో సహా పలువురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.