తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 24 గంటల గడువు ముగిసిందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది సైనికులను చంపేశామని ప్రకటించింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించడంతో తమ చేతులకు పని చెప్పామని వ్యాఖ్యానించింది.