GNTR: వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపల్లిపాడు చెరువు వద్ద జూదం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందడంతో, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. వట్టిచెరుకూరు సీఐ రామా నాయక్ సమక్షంలో పోలీసు స్టేషన్ సిబ్బందితో కలిసి టాస్క్ ఫోర్స్ బృందం చర్యలు చేపట్టింది. పాల్గొన్న 5 మందిపై కేసులు నమోదు చేశారు.