ELR: కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాల్లో సోమవారం జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. కుక్కునూరు మండలంలోని జిన్నేలగూడెం అటవీ ప్రాంతంలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో 200 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.