ATP: యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన 15 ఏళ్ల రాకేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తెల్లవారుజామున గ్రామంలోని మెకానిక్ జాఫర్ షాప్ వద్ద అతను విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.