NLR: కోవూరు మండలం రామన్నపాలెం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వైజాగ్ నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ట్రావెల్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.