AP: నెల్లూరులో రాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. బుచ్చిరెడ్డిపాలెంలో హారన్ కొట్టాడని RTC బస్సు ఆపి డ్రైవర్పై దాడికి దిగారు. కారులో ఆరుగురు యువకులు ఉండగా.. ఈ దాడి చేసిన తర్వాత వారంతా పరారయ్యారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.