AP: అల్లూరి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో ప్రయాణికుల హాహాకారాలు కలిచివేస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.