పల్నాడు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినుకొండలోని NSP జిల్లా పరిషత్ పాఠశాలలో బాలికల వేసవి శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇవాళ ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు గతంలోనే టీడీపీ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచిందని గుర్తు చేశారు.
ATP: శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా MLA కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలోని వాసవీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్త్రీ శక్తికి నిదర్శనమైన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తులకు జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అందరికీ సకల శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఆర్యవైశ్య ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
GNTR: తెనాలి ఐతానగర్లో శ్రీ వెంకయ్య-గౌరమ్మ పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మే 1 వరకు జరిగే వేడుకల్లో అఖండ దీపం, ఊరేగింపు, గుమ్మడి సిడి, జల బిందెలు, పూలకప్పెర వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం పొంగళ్లు, మొక్కుబడులతో ఉత్సవాలు ముగుస్తాయి.
AKP: సింగపూర్ పర్యటనలో భాగంగా 6వ రోజు టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ విధానంపై అధ్యయనం చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏదైనా ఓ సమస్య ఏర్పడినప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఒక టీంగా ఏర్పడి పరిష్కరించడానికి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకున్నామన్నారు. దీనిపై డాక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారన్నారు.
SKLM: స్వీయ గణన మనందరి బాధ్యత అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం జనాభా గణనలో భాగంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5కె రన్ ర్యాలీ నిర్వహించారు. స్వీయ గణన ప్రతి ఒక్క పౌరుని బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, జేసీ, అధికారులు పాల్గొన్నారు.
ELR: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చింతలపూడి ఎమ్మెల్యే అన్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసపత్రులలో ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఆసుపత్రిక కావలసిన మౌలిక సదుపాయాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.
KRNL: బేతంచెర్లలోని అమ్మవారి శాలలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవీ మహిళా మండలి సభ్యులతో కలిసి 46 మంది దంపతులు సామూహిక హోమంలో పాల్గొన్నారు. ముందుగా జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల సందడి నెలకొంది. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులుహాజరవుతున్న నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ‘పీజీఆర్ఎస్’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రకటించారు. కావున ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.
WG: నరసాపురం పెట్రోల్ బంకుల్లో ఆదివారం MRO ఐ.వి.వి. సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని పలు బంకుల్లో ఇంధన నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టించినా, డీజిల్ అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆదివారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సుమారు 10 శాతం బంకుల్లో సరఫరా లేక మూతపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్యానిక్ కొనుగోళ్లతో డిమాండ్ 50 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కర్నూలు, నంద్యాల కలెక్టర్లను వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
NLR: నెల్లూరు రూరల్ సౌత్ మోపూరు గ్రామానికి చెందిన పలువురు ఆదివారం టీడీపీలో చేరారు. వారికి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పసుపు కండువా వేసి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి యువత టీడీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ ప్రాధాన్యమిస్తామని చెప్పారు.
SS: అమృత్ 2.0 పథకం కింద హిందూపురంలో రూ.79 కోట్లతో 28 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకు జిందాల్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. ప్లాంట్ కోసం 4.5 ఎకరాల భూమిని ఆదివారం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైతే ప్రత్యామ్నాయ స్థలాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
NDL: జూపాడు బంగ్లా మండలం తంగడంచలో ఉల్లి పంటను ఆదివారం పరిశీలించిన సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు, ఉల్లి రైతులకు క్వింటాకు కనీస మద్దతు ధరగా రూ. 2 వేలును ప్రకటించాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్లో రైతులు ఎకరాకు రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
KRNL: ఎమ్మిగనూరులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియోజకవర్గ కో- ఆర్డినేటర్ కాసిం వలి ఆదివారం మాట్లాడుతూ.. 10 రోజులుగా ఇంధన కొరతతో రవాణా వ్యవస్థ దెబ్బతిందన్నారు. వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని అయన పేర్కొన్నారు.
ATP: మాజీ మంత్రి కీర్తిశేషులు పుట్టపాగ మహేంద్రనాథ్ శతజయంతి ఉత్సవాలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉండి, ప్రజా సేవలో ముందుంటానని ఎమ్మెల్యే శ్రావణి పేర్కొన్నారు.