SKLM: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో బుధవారం వరుస చోరీల కలకలం రేగింది. పాత జాతీయ రహదారిపై ఉన్న చికెన్ షాప్, డెకరేషన్ షాపుతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని మరో దుకాణంలో దొంగలు పడ్డారు. ఈ ఘటనల్లో సుమారు రూ.75 వేల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. ఒకే రోజు మూడు చోట్ల చోరీలు జరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన నిత్య అన్నదానం ట్రస్ట్కు బెంగళూరుకు చెందిన గౌతమి, వారి కుటుంబ సభ్యులు రూ.1 లక్ష విరాళంగా చెక్కు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
SS: ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి నుంచి 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను మంత్రి త్రివేణి ప్రారంభించారు. కాలనీవాసుల ఆరోగ్యమే ప్రాధాన్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. స్వచ్ఛమైన నీటితో రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆమె తెలిపారు.
BPT: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. వేమూరు నియోజకవర్గంలోని సురేపల్లి గ్రామంలో గురువారం జరగనున్న పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు విధులపై జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించారు.
PLD: మండల కేంద్రమైన ఈపూరు ఏపీ మోడల్ స్కూల్లో ఏప్రిల్ 12వ తేదీన 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మజ ఓ ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందన్నారు.
GNTR: చట్టసభల్లో పద్మశాలీలకు ప్రాధాన్యం దక్కడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, తమకు 16 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజధానిలో భవన్కు 3 ఎకరాలు ఇవ్వాలన్నారు. తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 26న మంగళగిరిలో పద్మశాలి మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మి రాజమండ్రిలోని కేంద్ర కారాగారం & మహిళా కారాగారాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కారాగారాలలో ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖైదీల తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు సహాయం అందిస్తామన్నారు.
ప్రకాశం: జిల్లా SP హర్షవర్ధన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. కొందరు మోసగాళ్లు పోలీసులుగా నటిస్తూ వీడియో కాల్ చేసి మీరు అరెస్ట్లో ఉన్నారని భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఇటువంటి కాల్స్ నమ్మకుండా వెంటనే కట్ చేయాలని, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఇవ్వకూడదన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలి లేదా సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయాలని అన్నారు.
ATP: ఉరవకొండలోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నాయకుల సమస్యలను మంత్రి శ్రద్ధగా విని వారి నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
TPT: అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం వడ్డీపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యపై సత్యవేడు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సెక్రటరీ రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.
SS: హిందూపురం రూరల్ మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న రూరల్ అప్గ్రేడ్ సీఐ చంద్రాంజనేయులు ఘటన స్థలానికి చేరుకుని పూర్తిగా కాలిపోయిన మహిళ శవాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు
NTR: జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నేపాగ సుందర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య నియమాలు పాటించాలని, వ్యాయామం, పౌష్టికాహారం అవసరమని సూచించారు. ఆసుపత్రి సౌకర్యాలను పరిశీలించారు.
VZM: జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందిచటమే లక్ష్యమని జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం మినిస్టరీ ఆఫ్ పవర్ అనుబంధ సంస్థ ఈఈఎస్ఎల్ (EESL) ప్రతినిధులతో డీసీసీబీ కార్యాలయంలో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డీసీసీబీ-ఈఈఎస్ఎల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు (MOUలు) చేసుకున్నామని తెలియజేశారు.
KRNL: ఆలూరు మారెమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈడిగ మునెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: ఆలూరు మారెమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈడిగ మునెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.