W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బి. కొండేపాడులో శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో వభ్వోపేతంగా శనివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని, వేదపండితుల ఆశీర్వాదాలు పొందారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఉదయం బలుహరణ, సంప్రోక్షణ చేసి స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలు పొందారు.
పోలవరం జిల్లా కలెక్టర్ కే.దినేష్ కుమార్ గుర్తేడు మండలం సింగనికోట గ్రామంలో శనివారం పర్యటించారు. ఐదు కిలోమీటర్ల కొండలు, వాగులు కాలినడకన దాటి గ్రామానికి చేరుకున్నారు. ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాలపై గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పండ్ల తోటల కోసం మొక్కలు అందిస్తామని హామీ ఇచ్చి, గ్రామాభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు.
KRNL: కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులు దెబ్బతిన్నాయని ఎమ్మిగనూరులో ఇవాళ సీఐటీయూ నాయకులు విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10-12 గంటల పని వేళలు అమలు చేయడం దోపిడీకి దారితీస్తుందని తెలిపారు. మహిళలను రాత్రి షిఫ్టుల్లో పనిచేయించే చట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
NDL: నంద్యాల పట్టణంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఓ విశేషమైన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇద్దరు HIV బాధితులు ఆదర్శ వివాహం చేసుకుని సమాజానికి సానుకూల సందేశాన్ని అందిస్తూ ప్రశంసలు అందుకున్నారు. నంద్యాల ఎస్.ఆర్.బీ.ఎస్ కాలనీలో ఉన్న పరివర్తన్ లైఫ్ సెంటర్లో HIV బాధితుల ఆదర్శ వివాహాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
CTR: ప్రివెంటివ్ పోలీసింగ్ చర్యల్లో భాగంగా కార్వేటినగరం PSలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి చట్టపరమైన హెచ్చరికలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేర ప్రవృత్తిని వీడి, భవిష్యత్తులో సన్మార్గంలో జీవించాలని హితవు పలికారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ATP: అనంతపురం మహిళా నేత, ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న శనివారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా లింగాయత్ సామాజిక వర్గ సమస్యలు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో చర్చించారు. ఈ మేరకు సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
ASR: పాడేరు వైద్య కళాశాల ఆవరణలో శనివారం వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. జిల్లాలో రక్తపు నిలువలు పెంచేందుకు, ప్రాణాపాయంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు వైద్య విద్యార్థులు రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమని పలువురు వర్షం వ్యక్తం చేశారు. ప్రధానాచార్యులు డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రక్తదానం ఒక అలవాటుగా తీసుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
సత్యసాయి: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. శనివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 190 రోజుల్లోనే సీమకు 40 టీఎంసీల కృష్ణా జలాలను అందించామని పేర్కొన్నారు.
VZM: కొత్తవలస-విజయనగరం ప్రధాన రహదారి డా. బెల్లాల రామారావు హాస్పిటల్ నుంచి అన్న క్యాంటీన్ వరకు వెళ్ళే మురుగుకాలువ చెత్తతో పేరుకుపోయి రోడ్డుమీద ప్రవహిస్తుందని శుక్రవారం HIT TVలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. వార్తకు స్పందించి పంచాయతీ సిబ్బంది శనివారం కాలువలో పేరుకుపోయిన చెత్తను తీసి మురుగునీరు వెళ్ళేలా చేశారు. దీంతో దుకాణదారులు హర్షం వ్యక్తం చేశారు.
AKP: చోడవరం పట్టణంలోని ఎడ్లవీధి అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ గోవాడ వరలక్ష్మీ మాట్లాడుతూ.. తల్లులు తమ పిల్లలకు పోషక విలువలు గల ఆహారం అందించాలని చెప్పారు. పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల వారి మెదడు ఉత్తేజంగా పని చేస్తుందన్నారు. సెల్ ఫోన్లను పిల్లలకు దూరంగా ఉంచాలని సూచించారు.
PLD: క్రోసూరు మండల కేంద్రంలో సీపీఐ నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్హులైన పేదలకు నివేశ స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలకు 50 సంవత్సరాలకే పింఛన్ అందించాలని కోరారు. కార్మికులకు, కర్షకులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ASR: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పునాదులు వేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కలెక్టర్ నిషాంతి కొనియాడారు. శనివారం పాడేరులో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యా ప్రాముఖ్యతకు, కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే చేసిన పోరాటం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.
GNTR: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డులో శనివారం జనగణనపై ప్రజలకు క్షేత్రస్థాయిలో కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పరిశీలించారు. ఇంటింటికి తిరుగుతూ జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించి, వివరాలు నమోదు చేసి ఇంట్లో జాబితా రూపొందిస్తున్నారని వివరించారు.
BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్టలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు వ్యక్తిని వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. తీవ్ర రక్తస్రావమై, క్షతగాత్రుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.