CTR: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సమిష్టి కృషితో పాటు.. అవగాహన కల్పించాలని కోరారు.
W.G: రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, కోఆపరేటివ్ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గురువారం జిల్లా జేసీ రాహుల్ కుమార్ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, మే నెలలు రబీ సీజన్కు కీలకమని ఈ కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి కేంద్రంలో కనీసం 50 శాతం గోనె సంచులు సిద్ధం చేయాలని కోరారు.
KRNL: వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో బాల్య వివాహాలు, కౌమార గర్భాల నివారణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ “బాల్య వివాహ విముక్తి ప్రచార రథం” కార్యక్రమం నిర్వహించారు. కళాజాత బృందాలు పాటలు, నాటికల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాయి. ICDS పద్మావతి, సరస్వతి పలువురు “బేటీ బచావో – బేటీ పడావో” సందేశంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
GNTR: తెనాలి మండలంలో జనాభా గణనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్వో గోపాలకృష్ణ తెలిపారు. మే 1–30 వరకు హౌస్ లిస్టింగ్, ఏప్రిల్ 16–30 వరకు స్వచ్ఛంద నమోదు అవకాశం కల్పించారు. జనాభా గణనకు ప్రజలు భయపడకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ELR: ఏలూరులో గిలకల గేటు రైల్వే ట్రాక్పై గురువారం ఉదయం ఓ డెడ్ బాడీ కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న ట్రాక్ మ్యాన్ రెండు ముక్కలైన మృతదేహాన్ని చూసి రైల్వే జీఆర్పీ ఎస్సైకు సమాచారం ఇచ్చారు. ఎస్సై దానం ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించి ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందవచ్చునన్నారు. మృతుడికి 65 ఏళ్లు ఉండవచ్చునని పేర్కొన్నారు.
NLR: కావలికి చెందిన దరిశి వెంకట సత్య ధనుష, ఇటీవల జూనియర్ సివిల్ న్యాయాధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె గురువారం నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయంలో గౌరవ జిల్లా జడ్జి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. న్యాయ రంగం పట్ల నేటి యువత ఆసక్తి చూపడం అభినందనీయమని అన్నారు.
పార్వతీపురం పట్టణంలో కుక్కల, ఆవుల విహరం విపరీతంగా ఉన్నాయని వాటి వలన జరుగుతున్న ఇబ్బందులను వెంటనే నివారించాలని సీపీఎం పట్టణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ కె.శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సమస్యకువెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
VZM: గజపతినగరం మండలం మధుపాడలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక టేకు తోటలో గుర్తుతెలియని వ్యక్తులు పొగతాగి పడేయడంతో మంటలు చెలరేగాయి. బుర్ల నాయుడు, అప్పలనాయుడు, కృష్ణలకు చెందిన రెండు ఎకరాల తోట దగ్ధమైంది. ఇందులో సుమారు రూ. 30 వేల ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం నగరంలోని ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించారు. ఈ మేరకు పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కును అందరికీ అందుబాటులో ఉండే వినోద ప్రదేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే, పచ్చని వాతావరణంతో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
AKP: ఖరీఫ్ సీజన్కు సన్నద్ధం అవుతున్న రైతులకు గురువారం ఎలినినోపై ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరులో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎలినినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో పాటు వాతావరణం వేడెక్కే అవకాశాలు ఉన్నాయని ఏవో సౌజన్య తెలిపారు. అలాగే, విత్తన గుళికలు తయారీ గురించి సిబ్బందికి వివరించారు.
ASR: కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను గురువారం గురుకులం కార్యదర్శి సీఏ మణి కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు మెనూ పక్కాగా అమలు చేయాలని అధికారులకి సూచించారు. అలాగే, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు.
NDL: రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం డోన్ మండలంలోని కొత్తబురుజులో జరిగిన సమావేశానికి కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సమస్యలు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాటు ఇతర సమస్యలపై ప్రజలతో ఆమె నేరుగా మాట్లాడారు.
ATP: వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2003 ఏప్రిల్ 9న ఎర్రటి ఎండలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్సార్ ఈ యాత్ర ప్రారంభించారని పేర్కొన్నారు. నాటి పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కోనసీమ: అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామానికి చెందిన అడ్డాల రామకృష్ణ గణపతి గురువారం రూ. 67 వేల విలువైన మూడు మంచాలను, పరుపులను అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు PHC వైద్యాధికారి డాక్టర్ మంగాదేవికి అందజేశారు. డాక్టర్ మంగాదేవి దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
CTR: చౌడేపల్లె మండలం బోయకొండ సమీపంలో ఈనెల 5న కుమారుని కళ్లెదుటే గాంధీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ తెలిపారు. నిందితులు నరసింహులు, లక్ష్మీపతి, రాసతి, నాగరాజులను గురువారం బోయకొండ ఆర్చి వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.