• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు డోన్‌కు రానున్న అర్జున్ అమర్నాథ్

NDL: డోన్ పట్టణంలోని న్యూ మహాలక్ష్మి హాస్పిటల్ పక్కన ఏర్పాటు చేసిన “సోనో స్కాన్స్” కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు YCP యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు.

April 26, 2026 / 08:13 AM IST

నేడు రాతిదూలం లాగుడు పోటీలు ప్రారంభం

ATP: గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో ఆదివారం వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాల సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆరుపల్ల ఒంగోలు జాతి ఎద్దులకు రాతిదూలం లాగు పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ..రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మొదటి బహుమతి రూ.35 వేలు, 2వ బహుమతి రూ.30 వేలు, 3వ బహుమతి రూ.20 వేలు, అందజేస్తున్నట్లు తెలిపారు.

April 26, 2026 / 08:11 AM IST

కాకినాడ – మైసూర్ మధ్య బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్

KKD: కాకినాడ నుంచి మైసూర్ వెళ్లే స్పెషల్ ట్రైన్‌ను బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ రైల్వే శాఖ అనుమతించిందని సామర్లకోట స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ట్రైన్ నెం.17289/17290 కాకినాడ నుంచి సోమ, శుక్రవారాల్లో.. మైసూర్ నుంచి గురు, శనివారాల్లో నడుస్తుందని వివరించారు. ప్రయాణికులు ఈ మెరుగైన రైలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 26, 2026 / 08:09 AM IST

అంగరంగ వైభవంగా వాసవి అమ్మవారి జన్మదిన వేడుకలు

GNTR: తెనాలిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఆదివారం ఉదయం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మునగాల మోహన శ్యాం ప్రసాద్ చేతుల మీదుగా వైశ్యపతాక ఆవిష్కరణతో ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి 11 రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. ఈ ఉత్సవాలలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 26, 2026 / 07:54 AM IST

వైసీపీ హయాంలో చిరస్థాయి అభివృద్ధి: జగ్గిరెడ్డి

కోనసీమ: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చిరస్థాయిగా నిలిచే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పి.గన్నవరంలో శనివారం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్‌నెస్ సెంటర్లు వంటి వినూత్న వ్యవస్థలను జగన్ స్థాపించారని కొనియాడుతూ పార్టీ బలోపేతంపై చర్చించారు. 

April 26, 2026 / 07:51 AM IST

పాలిసెట్‌కు 93 శాతం హాజరు

ATP: జిల్లాలో శనివారం నిర్వహించిన పాలిసెట్- 26 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 9,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 9,110 మంది హాజరయ్యారు. ఇందులో 5,557 మంది బాలురు, 3,553 మంది బాలికలు ఉన్నారు. జిల్లా పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి తెలిపారు. 

April 26, 2026 / 07:44 AM IST

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

KRNL: కల్లూరు అర్బన్ పరిధిలోని 19వ వార్డులో నగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న మున్సిపల్ పార్కులు, సీసీ డ్రైనేజీల అభివృద్ధి పనులకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరు జనార్దన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 26, 2026 / 07:37 AM IST

వ్యక్తిని ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని ముంబై జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్లో రోడ్డు దాటుతున్న వ్యక్తిని అకస్మాత్తుగా బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అవ్వగా ఇరువురిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

April 26, 2026 / 07:35 AM IST

చెత్త రహిత జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దాలి: కలెక్టర్

NDL: జిల్లాను చెత్త రహితంగా మార్చేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని శనివారం కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో స్వచ్ఛ సర్వేక్షణపై మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేటి నుంచి మే 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణపై కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు పర్యటించనున్నాయన్నారు.

April 26, 2026 / 07:33 AM IST

నేడు అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభం

అనకాపల్లి: మండల కేంద్రమైన ఎస్. రాయవరంలో రూ.1.5 కోట్లతో నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయం ఇవాళ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా రెండు రోజులు నుంచి ఆలయంలో పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. శనివారం సాయంత్రం విగ్రహాలకు కలశాలకు పాలు, తేనె, పెరుగు, పంచదార తదితర వాటితో అభిషేకాలు చేశారు.

April 26, 2026 / 07:20 AM IST

చెడు వ్యసనాలకు లోనైతే జీవితాలు నాశనం అవుతాయి: CI

VZM: యువత చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని బొబ్బిలి CI కె.నారాయణరావు సూచించారు. శనివారం సాయంత్రం స్దానిక కోమటిపల్లిలో అభ్యుదయం 2.0 నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు లోనైతే జీవితాలు నాశనం అవుతాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు, ATM, అధార్‌, OTP వివరాలు చెప్పవద్దన్నారు.

April 26, 2026 / 07:17 AM IST

రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక

BPT: పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు ఎస్సై పులి గోపి శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని, శాంతి భద్రతలకు సహకరించాలని సూచించారు. చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో మంచి పౌరులుగా మారి జీవనోపాధిపై దృష్టి పెట్టాలని తెలిపారు. పోలీసులు పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం ఆయన చేశారు.

April 26, 2026 / 07:16 AM IST

సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

మన్యం: జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి శనివారం సీతానగరం మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా పెద్ద భోగిల్లి గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆనంతరం సిబ్బంది హాజరు పట్టిక, వారి కదలిక రిజిస్ట్రార్‌ను నిశితంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు.

April 26, 2026 / 07:13 AM IST

ఇంధన సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు భీమవరం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ తెలిపారు. వరి కోతలు, ఆక్వా సాగు యంత్రాలు, రవాణా వాహనాలకు ఇంధన కొరత లేకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఎదురైతే ప్రజలు వెంటనే 8121676653 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

April 26, 2026 / 07:10 AM IST

అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

CTR: యాదమరి మండలం సంతగేటు గ్రామంలో అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఎస్సై ఈశ్వర్, డీటీ జయంతి, ఆర్‌ఐ ప్రసాద్ నిర్వహించిన ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 9 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న అబ్దుల్ సలాంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

April 26, 2026 / 07:09 AM IST