TPT: వేసవి సెలవులు మొదలు కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుపతిలో జారీ చేస్తున్న దర్శన టోకెన్లు గంటల వ్యవధిలో అయిపోతున్నాయి. ఫ్రీ దర్శనం కోసం వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు టోకెన్ల కోసం మరుసటి రోజు కోసం ఆగాల్సివస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జీల ధరలు ఎక్కువ కావడంతో చెట్ల కిందే నిద్రిస్తున్నారు.
విశాఖ వాణిజ్య పన్నుల శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,845.39 కోట్ల వసూళ్లతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని జాయింట్ కమిషనర్ పీబీ వల్లీ తెలిపారు. గత ఏడాది రూ.1,733.59 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.111.8 కోట్ల అధికంగా ఆదాయం నమోదైందన్నారు. బకాయిల వసూళ్లలో పురోగతి సాధించి, 2025 మార్చి నాటికి రూ.150.71 కోట్ల నుంచి 2026 మార్చి నాటికి రూ.158.59 కోట్లకు పెరగిందని వెల్లడించారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో ఇవాళ చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమార్చన, రుద్రాభిషేకం చేశారు. ప్రత్యేక వారంగా భావించి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు సౌకర్యాల కోసం కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
PPM: సీతంపేట మండలం దుగ్గి గ్రామానికి వెళ్లే తారు రహదారి పూర్తిగా ఛిద్రమైంది. కూడలి నుంచి గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల మార్గం నామరూపాల్లేకుండా తయారైంది గ్రామస్థులు తెలిపారు. రాళ్ల కుప్పలు పరిచినట్లు మారిందన్నారు. నడిచి వెళ్తే కాళ్లకు రాళ్లు గుచ్చుకుంటున్నాయని, వాహనాలపై వెళ్లా మంటే టైర్లు తరచూ పంక్చర్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
KKD: తుని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్టికెట్లు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ విశ్వశాంతి తెలిపారు. ఏప్రిల్ 12న నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు ఈ పరీక్ష అత్యంత కీలకమన్నారు.
E.G: సింగరాజుపాలెం ఎస్సీ కాలనీలో పైపుల ద్వారా మురికినీరు వస్తోందని కాలని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా కలుషిత నీరు తాగడంతో అనారోగ్య సమస్యలు పెరిగినట్లు స్థానికులు తెలిపారు. సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో సమస్యను పట్టించుకునే వారు లేరని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటరాజు స్పందించి అధికారులతో వెంటనే మరమ్మతులు చేయించారు.
ATP: తాడిపత్రిలోని ప్రసిద్ధ బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో మంగళవారం ఉదయం స్వామివారిని విశేషంగా సపోటా పండ్లతో అలంకరించారు. శివలింగం చుట్టూ పండ్లను అమర్చిన తీరు సందర్శకులను కట్టిపడేసింది. ప్రకృతి ప్రసాదాలతో దైవాన్ని కొలవడం భక్తికి, పర్యావరణ హితానికి నిదర్శనమని అర్చకులు యోగానందశర్మ పేర్కొన్నారు. ఫలాల అలంకరణను చూసి భక్తులు పులకించిపోయారు.
GNTR: తెనాలి గాంధీచౌక్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో ఐతే నడిచి వెళ్లేందుకు కూడా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అటువంటి చోట పలువురు రోడ్డు మీద వరకు వాహనాలు నిలిపి ఉంచి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. గాంధీచౌక్ నుంచి బోసురోడ్డు మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ల ఎదుట రోడ్డు మధ్య వరకు బైక్లు పార్క్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు.
SS: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తన పుట్టినరోజును పురస్కరించుకుని ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. భక్తులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
NDL: కొలిమిగుండ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 11 వరకు ‘పోలీస్ 30 యాక్ట్’ అమల్లో ఉంటుందని సీఐ రమేశ్ బాబు తెలిపారు. బహిరంగంగా గుంపులుగా చేరడం, ర్యాలీలు, సభలు నిషేధించారు. అవసరమైన కార్యక్రమాలకు ముందస్తుగా డీఎస్పీ అనుమతి తప్పనిసరి అని హెచ్చరించారు.
E.G: రాజమండ్రి మారంపూడిలో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి 12వ వార్షికోత్సవ జాతర సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి దుర్గేశ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మంత్రిని సత్కరించారు. జాతర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
ASR: అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ మరివలస ప్రాథమిక పాఠశాల శిధిలావస్థకు చేరింది. సుమారు 25 మంది విద్యార్థులు ప్రాణభయంతోనే చదువులు కొనసాగిస్తున్నారు. పైకప్పు స్లాబ్ ముక్కలు పడుతుండగా, కిటికీలు–తలుపులు దెబ్బతిన్నాయి. వర్షాకాలంలో ప్రమాదం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే కొత్త భవనం నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
భారతీయ జనతా పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తవలస మండల కాటకాపల్లి గ్రామంలో ‘మన ఊరు- మన జెండా’ కార్యక్రమం సోమవారం విజయనగరం జిల్లా వైస్ ప్రెసిడెంట్ చొక్కాకుల అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ రాముడు, తదితరులు పాల్గొన్నారు.