CTR: పాకాల(మం) పులితివారిపల్లెలో ఓ వ్యక్తి మృతి స్థానికంగా కలకలం రేపింది. ఓ మామిడి తోటలో చలమచర్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించి ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాకాల సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KNL: ఆదోనిలో రౌడీ షీటర్లపై పోలీసుల కఠిన వైఖరి కొనసాగుతోంది. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆదివారం రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలు కాపాడటంలో సహకరించాలని, పోలీసుల పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు.
KDP: ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు.
TPT: మాజీ టీటీడీ డిప్యూటీ ఈవో అంచపరెడ్డి చెంగారెడ్డి పెద్దకర్మ కార్యక్రమం పెరుమాలపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని చెంగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
PLD: బెల్లంకొండలో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కరణ కర్త మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ అని MRPS మండల నేతలు అన్నారు. ఆయన సేవలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు రాణించాలని కోరారు
ATP: యాడికి మండలంలో రేపు CM చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసంలో టీడీపీ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, పలువురు ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై వారు చర్చించారు.
NTR: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. రంగవల్లులతో ప్రాంగణం కళకళలాడగా “జై అమరావతి” నినాదాలు మార్మోగాయి. రాజధాని అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అని, సీఎం నాయకత్వంలో వేగంగా ముందుకు సాగుతుందని సౌమ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంటూరు: జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ అర్జీల స్టేటస్ను సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి. ‘మీకోసం’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా అర్జీలు సమర్పించవచ్చు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం SR శంకరన్ హాల్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి.
కృష్ణా: గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో కామ్రేడ్ చింతపల్లి లక్ష్మారాయుడు 6వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆయన పేదల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. గ్రామాభివృద్ధి, పేదలకు నివాస స్థలాల కల్పనలో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLR: చిట్వేలి మండల పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్వేల్ -రాపూరు ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు బలంగా ఢీకొన్నాయి. చిట్వేల్ నుంచి నెల్లూరు వెళ్తున్న లారీ, నెల్లూరు నుంచి వస్తున్న కారు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రకాశం: ఈస్టర్ మొదటి పౌర్ణమి తరువాత ఆదివారం జరుపుకునే పండుగని మంత్రి స్వామి అన్నారు. ఏసుక్రీస్తు మరణం తర్వాత మూడవరోజు సజీవుడుగా లేచిన రోజుగా పరిగణిస్తారని ఆయన జ్ఞాపకార్థం క్రైస్తవులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో ఈస్టర్ ఒకటని మంత్రి స్వామి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
E.G: తమ విలువైన వస్తువులైన బంగారం, వెండి, పత్రాలను దొంగతనాల బారి నుంచి కాపాడుకోవడానికి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కడియం CI వెంకటేశ్వరావు ఆదివారం సూచించారు. కుటుంబాలు ఎక్కువ కాలం పాటు తమ ఇళ్లను విడిచి వెళ్తున్నప్పుడు సమీపంలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయాలన్నారు. తద్వారా పోలీసులు ప్రజల కదలికను పర్యవేక్షిస్తారన్నారు.
అనకాపల్లి మండలం గుండాల శంకరన్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో ఉన్నత పదవులను నిర్వహించి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.
శ్రీకాకుళంలో బాల భవన్ నందు సమగ్ర శిక్షా ఉద్యోగుల జేఏసీ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ కాంతారావు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే 15న మంత్రి లోకేష్ ఇంటి వరకు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.
VSP: మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా విశాఖలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఆయన విగ్రహం వద్ద జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అమోఘమన్నారు.