• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

W.G: భీమవరం పట్టణంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం యోగా సాధన చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చని వివరించారు.

April 12, 2026 / 07:27 PM IST

పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం

ATP: గుత్తి RS లోని జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో 2001లో టెన్త్ క్లాస్ చదువుకున్న విద్యార్థులు అపూర్వ సమ్మేళనం పేరుతో ఆదివారం కలుసుకున్నారు. శ్రీ సునామ జకినీ మాత ఆలయంలో పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులు పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. తమ చిన్ననాటి మిత్రులతో సరదాగా గడిపారు.

April 12, 2026 / 07:17 PM IST

రామచంద్రపురంలో ముమ్మర తనిఖీలు

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రామచంద్రపురంలో ఆదివారం ‘కార్డెన్ సెర్చ్’ నిర్వహించారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలను, నిల్వలను అరికట్టడమే లక్ష్యంగా సోదాలు నిర్వహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 12, 2026 / 07:10 PM IST

వెంకటేశ్వర స్వామికి వైభవంగా తిరుప్పావడ సేవ

GNTR: తెనాలిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన తిరుప్పావడ సేవను ఆదివారం శ్రీ విఖనస శ్రీనివాస్ ట్రస్ట్ అంగరంగ వైభవంగా నిర్వహించింది. స్థానిక బాలాజీరావుపేటలో నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

April 12, 2026 / 07:05 PM IST

మహాసభల్లో పాల్గొన్న చీరాల ఎమ్మెల్యే

BPT: ఒంగోలులో జరిగిన కృష్ణ బలిజ సంఘం 14వ రాష్ట్ర మహాసభల్లో చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ ఐక్యత, అభ్యున్నతికి యువత ముందుండాలని అన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా నేతలు కృషి చేయాలని చెప్పుకొచ్చారు.

April 12, 2026 / 07:02 PM IST

2018లో తప్పించుకుని ఇప్పుడు దొరికాడు‌..!

తిరుపతి జిల్లాలో ఒంటరి మహిళలే లక్ష్యంగా సాగుతున్న వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. రామచంద్రాపురం కేసులో పట్టుబడ్డ పి. విశ్వనాథ్ అసలు పేరు ఎ.ఎం. అజీజ్‌గా గుర్తించారు. 2018లో తప్పించుకున్న ఇతడు, మూడు రాష్ట్రాల్లో ఏకంగా 21 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితుడి నుంచి రూ. 21.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

April 12, 2026 / 07:00 PM IST

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా

VZM: అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడుతున్నామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అన్నారు. బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి రవాణా చేసినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నివారణకు సహకరించాలని కోరారు. బెట్టింగులు వేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.

April 12, 2026 / 07:00 PM IST

రుషికొండలో స్కూటీకి మంటలు.. పూర్తిగా దగ్ధం

VSP: రుషికొండ బీచ్ రోడ్డుపై ఆదివారం ప్రయాణిస్తున్న స్కూటీకి అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వాహనం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై పక్కకు నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించి స్కూటీ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

April 12, 2026 / 07:00 PM IST

‘దళిత గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి’

PPM: దళిత గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఉత్తరాంధ్ర దళిత జేఏసీ మెంబర్ పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బత్తిన మోహన్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై, అట్రాసిటీ యాక్ట్‌పై పార్వతీపురం పట్టణంలోని గిరిజన భవన్లో సెమినర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి. చిట్టిబాబు పాల్గొని, అవగాహన కల్పించారు.

April 12, 2026 / 07:00 PM IST

రామదాసుపురంలో తీరిన విద్యుత్ కష్టాలు

SKLM: పొందూరు(M) రామదాసుపురంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ జోక్యం చేసుకోవడంతో విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. గ్రామంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్, 8 విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు ఆదివారం పూర్తయ్యాయి. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

April 12, 2026 / 07:00 PM IST

‘అన్న క్యాంటీన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి’

KRNL: ఆలూరులో నిర్మాణ దశలో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ సందర్శించారు. భవన నిర్మాణ నాణ్యతతో పాటు వంటగది, భోజనశాల సౌకర్యాలను పరిశీలించి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే అన్నా క్యాంటీన్ ఆలూరు ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.

April 12, 2026 / 06:44 PM IST

హెల్మెట్‌పై ట్రాఫిక్ సీఐ సూచనలు

NTR: ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ సూచించారు. విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ప్రాణ రక్షణకు ముఖ్యమని తెలిపారు. కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

April 12, 2026 / 06:44 PM IST

‘బెట్టింగ్‌లో పాల్గొంటే భవిష్యత్తు నశనమవుతుంది’

అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ క్రికెట్ బెట్టింగ్‌పై ప్రజలను అప్రమత్తం చేశారు. ఐపీఎల్ సీజన్‌లో సరదాగా మొదలయ్యే బెట్టింగ్ వ్యసనంగా మారి యువతను అప్పులు, నేరాల వైపు నెడుతుందని హెచ్చరించారు. సెల్‌ఫోన్ల ద్వారా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదై భవిష్యత్తు దెబ్బతింటుందని స్పష్టం చేశారు.

April 12, 2026 / 06:42 PM IST

’13న సర్వమత సమ్మేళనం విజవంతం చేయండి’

KKD: తుని పట్టణంలోని సాయి వేదిక ఫంక్షన్ హాల్‌లో ఈనెల 13న విశ్వశాంతి కోసం సర్వమత సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ప్రచార పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు పాల్గొని శాంతి, సామరస్యాలపై ప్రసంగించనున్నారని ప్రతినిధులు తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

April 12, 2026 / 06:40 PM IST

254 మందికి ఉచిత వైద్య పరీక్షలు

BPT: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వేమూరు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 254 మందికి పరీక్షలు నిర్వహించారు. సాల్వేషణ్ ఆర్మీ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు.

April 12, 2026 / 06:36 PM IST