W.G: ఈ నెల 5వ తేదీన చేపట్టనున్న ‘చలో ఆకివీడు’ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని ఎస్సై హనుమంతు నాగరాజు స్పష్టం చేశారు. దత్త గుడి నుంచి రామాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మండలంలో ప్రస్తుతం 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
KRNL: ఆస్తి వివాదం కారణంగా కన్న తండ్రి నన్నేసాబ్ను హత్య చేసిన ఇద్దరు కుమారులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుంటనహాల్ గ్రామంలో మార్చి 30న జరిగిన ఈ హత్య కేసులో, ఆస్తి విషయంలో తలెత్తిన వివాదమే కారణమని పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న పెద్దకుమారుడు నూర్ మహమ్మద్, జునైద్ పాటు అతని స్నేహితుడు రీహను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
VZM: ఈ నెల 12న ప్రపంచ శాంతి కోసం బొబ్బిలిలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు గురజాడ అద్యాయన వేదిక కన్వీనర్ విజయ గౌరీ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సామ్రాజ్యవాద దాడులను నిరసిస్తూ, యుద్ధం ఆగి ప్రపంచశాంతి కలగాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ సామాజిక విశ్లేషకులు రాంభూపాల్ వక్తగా హాజరవుతారన్నారు.
VSP: పీ.ఎం.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వతంత్ర నగర్ ఎన్టీఆర్ హుదూద్ కాలనీ (SF 2, బ్లాక్- 3)కు చెందిన భార్య తేజస్విని, కుమారుడు ధనుష్ కుమార్, కుమార్తె వేదిత కనబడుటం లేదు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈనెల 2వ తేదీన మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అన్ని చోట్లా వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదన్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నమయ్య: రైల్వేకోడూరు మండలంలోని కే.బుడుగుంటపల్లి పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామంలో 7 రోజులుగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సీతా సమేత శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామస్తులందరూ కలిసికట్టుగా, ఉభయ దాతల సహకారంతో ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ATP: రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం పావని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచ్ నాగరాజు, యూనిట్ ఇంచార్జి సత్యనారాయణను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాకినాడలోని జగన్నాథాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శానాలను ఈ నెల 5వ తేదీ నుంచి 10 తేదీ వరకు ఉండవని ఈఓ సత్యవాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయంలో మరమ్మతుల కారణంగా దర్శనాలను నిలిపివేస్తున్నామని చెప్పారు. కళ్యాణ మండపంలో ఉన్న ఉత్సవ మూర్తులను భక్తులు దర్శించుకోవాలన్నారు. ఈ అసౌకర్యానికి సహాకరించాలని ఆమె కోరారు.
E.G: కడియపు లంక రూర్బన్ పంచాయతీ ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ సునీల్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు తాజా మాజీ సర్పంచ్ మారిశెట్టి పద్మావతి స్వాగతం పలికారు. ప్రత్యేక అధికారి బాధ్యతలు తీసుకున్న సునీల్ కుమార్కు ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, పీఎసీఎస్ ఛైర్మన్ నర్సయ్య, కూటమి నాయకులు సుబ్బారావు, తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.
కడప-కనుమలో పల్లె మధ్య గిరిజ భవన్ వెనుక శుక్రవారం సాయంత్రం రైలు కిందపడి బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడు కడప నగరంలోని ప్రకాశ్ నగర్ కాలనీకి చెందిన చింతకుంట సురేష్గా గుర్తించారు. మృతుడు నగరంలోని KSRM ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు SI తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
NLR: జిల్లాలోని పాలెం వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను శుక్రవారం రాత్రి ఆత్మకూరు సీఐ గంగాధర్ తనిఖీ చేశారు. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు వారి సిబ్బందితో కలిసి బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను తనిఖీ చేసి ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. బస్సులో మంటలను ఆర్పే పరికరాలను ఉంచుకోవాలని సిబ్బందిని కోరారు.
TPT: సూళ్లూరుపెటలో నవజీవన్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న 55 ఏళ్ల ఉపేంద్రకు గుండెపోటు వచ్చింది. రాజా అనే యువకుడు వేగంగా స్పందించి ప్రథమ చికిత్స అందించాడు, స్టాఫ్ నర్స్ కోర్సు పూర్తి చేసిన అనుభవంతో ప్రాణం కాపాడాడు. రైలు స్టేషన్కు చేరగానే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజా చేసిన సేవకు వైద్యులు, ప్రయాణికులు అతన్ని నిజమైన హీరోగా ప్రశంసించారు.
WG: నరసాపురం రుస్తుంబాదకు చెందిన పేరి సాయి శరవణ (16) అనే బాలుడు అదృశ్యమైనట్లు పట్టణ ఎస్సై ముత్యాలరావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 1వ తేదీన మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
VZM: ఈనెల 11న BC హక్కుల సాధనకై ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు భారత చైతన్య యువజన పార్టి జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం పట్టణంలో కరపత్రాలను విడుదల చేశారు. అయన మాట్లాడుతూ.. SC, ST, BCలకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయ పద్ధతిలో కుల గణన చేపట్టాలని, BCలకు విద్య, ఉపాధి అవకాశాల్లో40 % రిజర్వేషన్ కేటాయించాలని కోరారు.
W.G: ఆకివీడులో జరిగిన హింసాత్మక ఘటనపై నిజనిర్ధారణ బృందాన్ని నియమించినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు. BRK నాయుడు, అమర్జహా బేగం, విశ్వేశ్వర్ రెడ్డి, అంకెమ్ సీతారామ్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందం బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి నివేదిక సమర్పించాలని ఆమె కోరారు.
కర్నూలు (మ) ఈ. తాండ్రపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించినట్లు CI తేజ మూర్తి శుక్రవారం తెలిపారు. ఆటో డ్రైవర్ మహేంద్ర, అతని స్నేహితుడు శివకుమార్పై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, వీరి అఘాయిత్యం కారణంగా బాధితురాలు గర్భవతి కావడంతో మార్చి 28న ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.