• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేతను పరామర్శించిన మంత్రి

ప్రకాశం: సింగరాయకొండ (మం) కలికివాయలో టీడీపీ సీనియర్ నాయకులు గాంధీ చౌదరిని మంత్రి డోలా శనివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల కాలంలో అయినా అనారోగ్యంతో ఆసుపత్రి నుంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చాడు. ఈ మేరకు గాంధీ ఆరోగ్య పరిస్థితుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. మంత్రి డాక్టర్ కావడంతో కొన్ని సలహాలు సూచనలు చేశారు.

April 4, 2026 / 01:28 PM IST

గుంతకల్లులో “రన్ ఫర్ జీసస్”

ATP: గుంతకల్లులో శనివారం ఉదయం “రన్ ఫర్ జీసస్” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రైస్తవులు పట్టణ పుర విధులలో యేసు క్రీస్తూ మరణాన్ని, పునురుత్తాన్ని గురించి చెబుతూ…, “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో “UCWF” జెనరల్ సెక్రటరీ సొల్మన్ విజయరాజ్, ప్రెసిడెంట్ ఇమ్మానుయేల్, వైస్ ప్రెసిడెంట్ చౌరప్ప, తదితర పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నార...

April 4, 2026 / 01:10 PM IST

ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలంలోని గంగమ్మ దేవాలయ ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు EO శ్రీనివాసులు తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి కలిగిన భక్తులు ఈవో కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారాలను తీసుకుని, 20 రోజుల్లోపు పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

April 4, 2026 / 01:09 PM IST

ద్రాక్షారామ ప్రత్యేక అధికారిగా పద్మజ్యోతి

కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామం ప్రత్యేక పరిపాలన అధికారిగా ఎంపీడీవో పద్మజ్యోతి బాధ్యతలు స్వీకరించారు. ఆమె ద్రాక్షారామంతో పాటు రామచంద్రపురం మండల పరిధిలోని వెల్ల, వెంకటాయపాలెం, వెలంపాలెం గ్రామాలకు కూడా ఆమె ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆమెను సచివాలయ ఉద్యోగులు, గ్రామ పెద్దలు ఆమెను కలిసి స్వాగతం పలికారు.

April 4, 2026 / 01:09 PM IST

టీటీడీ ఛైర్మన్‌ను తొలగించాలి.. వైసీపీ నిరసన

ATP: టీటీడీ చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడుని తొలగించాలని వైసిపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గుంతకల్లులోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. నైరుతి రెడ్డి మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

April 4, 2026 / 01:00 PM IST

భార్యతో మనస్పర్దాలు.. వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని పాపా కాలనీలో షేక్ రహీం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో మనస్పర్దాల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

April 4, 2026 / 12:55 PM IST

‘ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి’

KRNL: ప్రజలు ఆధ్యాత్మిక భావనను అలవర్చుకుని భగవంతుని అనుగ్రహం పొందాలని MP బస్తిపాటి నాగరాజు సూచించారు. ఇవాళ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కర్నూలు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కోల్స్ చర్చి ఆవరణంలో నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మికత మనసుకు శాంతి, సమాజానికి ఐక్యతను అందిస్తుందన్నారు.

April 4, 2026 / 12:40 PM IST

తెనాలిలో CMRF చెక్కుల పంపిణీ

GNTR: తెనాలి నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు CMRF చెక్కులను శనివారం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు వీటిని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనను కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు.

April 4, 2026 / 12:37 PM IST

రాజముద్రలతో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ

NTR: ఇబ్రహీంపట్నం(M) కొటికలపూడిలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ జరిగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాలు అందజేశారు. రీసర్వే పూర్తైన గ్రామాల్లో కొత్త పాస్‌పుస్తకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గతంలో రైతులు అధికారులు చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు అధికారులే రైతుల వద్దకు వెళ్లి పుస్తకాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.

April 4, 2026 / 12:34 PM IST

‘టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి’

KDP: టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా వైసీపీ నాయకులు శనివారం పులివెందులలో ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆయనకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరమని అన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

April 4, 2026 / 12:30 PM IST

పెదపాడులో వైసీపీ శ్రేణులు నిరసన ప్రోగ్రాం

ELR: పెదపాడు మండలం కలపర్రులోనీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వైసీపీ నేతలు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైన టీటీడీ ప్రతిష్టను మసకబారుస్తూ, అశ్లీల ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న టీటీడీ బోర్డు ఛైర్మెన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

April 4, 2026 / 12:29 PM IST

సేఫ్టీలు లేకుండా పడవ ప్రయాణం

PLD: అచ్చంపేట (మం) కోగంటివారిపాలెం కృష్ణా నదిలో ప్రయాణం చేసే పడవ ఎలాంటి సేఫ్టీలు లేకుండానే ఓవర్ లోడ్‌తో ప్రయాణం చేస్తుందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం పొందుపరిచిన నిబంధనలకు విరుద్ధంగా ఈ పడవ ప్రయాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఒక్కో పాసింజర్‌కు రూ. 50 చోప్పున పరిమితికి మించి పడవలో ప్రయాణం చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

April 4, 2026 / 12:21 PM IST

టీటీడీ ఛైర్మన్ నాయుడును పదవి నుంచి తొలగించాలి: వైసీపీ

PPM: వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు 54 మంది ఛైర్మన్‌లుగా చేసినప్పటికీ, ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ఆమె పేర్కొన్నారు.

April 4, 2026 / 12:20 PM IST

జోగారావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్ర మంత్రి

SKLM: నరసన్నపేటలో జోగారావు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులను ఇవాళ మాజీ కేంద్ర మంత్రి డా. కిల్లి కృపారాణి దంపతులు, వైసీనీ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నానన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

April 4, 2026 / 12:12 PM IST

పోలీస్ వాహనాలను ప్రారంభించిన ఇన్‌ఛార్జ్ మంత్రి

ELR: రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ కొరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నారని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 60 లక్షల విలువైన ఆరు వాహనాలను పోలీసు వ్యవస్థకు అంకితం చేశారు. వాటినీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

April 4, 2026 / 12:10 PM IST