• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డుమీద పారుతున్న మురుగునీరు

VZM: కొత్తవలస విజయనగరం ప్రధాన రహదారి బెల్లాల డాక్టర్ హాస్పిటల్ నుంచి అన్న క్యాంటీన్ వచ్చే మురుగుకాలువ ఇవాళ కురిసిన వర్షానికి కాలువలో పేరుకుపోయిన చెత్త రోడ్డు మీదకు కొట్టుకువచ్చింది. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు రోడ్డుమీద ప్రవహించడంతో దుకాణంలో ఉన్న సరుకులు జలపాతం అవుతున్నాయని దుకాణదారులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

April 10, 2026 / 08:41 PM IST

రౌడీ షీటర్లకు హెచ్చరిక జారీ చేసిన ఏఎస్పీ

అన్నమయ్య: రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే రౌడీ షీటర్లకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. మన్నూరు పోలీస్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిలింగ్‌లో నేరప్రవృత్తిని విడిచి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.

April 10, 2026 / 08:36 PM IST

‘పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయండి’

W.G: MLA ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబుని కలిశారు. తణుకు నియోజకవర్గంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సీఎంకు వివరించారు. నియోజకవర్గంలోని మున్సిపల్ రహదారులు, భవనాల నిర్మాణం, పెండింగ్లో ఉన్న ఇతర పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

April 10, 2026 / 08:29 PM IST

వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకం పొడిగింపు

అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ జీవోఎంఎస్ 43 జారీ చేసింది. ఈ పథకం ద్వారా అక్రిడిటెడ్, ఫ్రీలాన్స్, వేటరన్ జర్నలిస్టులు మరియు వారి కుటుంబాలకు క్యాష్‌లెస్ వైద్యం కొనసాగుతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమాచార అధికారి తెలిపారు.

April 10, 2026 / 08:28 PM IST

పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ప్రకాశం: దర్శి మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

April 10, 2026 / 08:28 PM IST

YCP అధికార ప్రతినిధి శ్యామలను కలసిన శీను

KRNL: ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలను ఆ పార్టీ తుగ్గలి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చెక్క శీను శుక్రవారం హైదరాబాదులో కలిశారు. ఆమెకు పూల మొక్కను అందజేశారు. మండలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శ్యామల ఆరా తీశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు శీను తెలిపారు.

April 10, 2026 / 08:26 PM IST

‘రేపు జిల్లాలో 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు’

శ్రీకాకుళం జిల్లాలో రేపు 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సరుబుజ్జిలి, సారవకోట, ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్.ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

April 10, 2026 / 08:20 PM IST

జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండండి.!

GNTR: జిల్లాలో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

April 10, 2026 / 08:20 PM IST

రక్తదానం చేసిన జేసీ మౌర్య భరద్వాజ్

SS: పుట్టపర్తిలో జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వే శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిని ప్రోత్సహించారు. జేసీ స్ఫూర్తితో సర్వేయర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా స్థాయి క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

April 10, 2026 / 08:20 PM IST

ఇంట్లోనే ప్రసవం చేసిన 108 సిబ్బంది

ASR: కొయ్యూరు మండలం కాకరపాడుకు చెందిన సునీత (24) అనే గర్భిణికి ఇవాళ సాయంత్రం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో, 108 సిబ్బంది అంబులెన్సులో వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ వర ప్రసాద్‌లు గర్భిణీకి ఇంట్లోనే ప్రసవం చేశారు. అనంతరం, వైద్యం కోసం పీహెచ్‌సీకి తరలించారు.

April 10, 2026 / 08:20 PM IST

ప్రజా సంక్షేమం ప్రభుత్వంతో సాధ్యం: టీడీపీ ఇంఛార్జ్

KDP: రాజంపేట నియోజకవర్గంలో ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. ఈనెల 16న నిర్వహించనున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. గ్రామ స్థాయిలో అవసరమైన వారికి సమాచారం అందించి శిబిరానికి హాజరు కావాలన్నారు.

April 10, 2026 / 08:19 PM IST

కడప ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి

KRNL: కడప జిల్లా ఖాజీపేటలో యువతి హత్యపై శుక్రవారం మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొంతు కోసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడి వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాగా తనను పెళ్లి చేసుకోలేదని యువతిని దారుణంగా శ్రీనివాస్ గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే.

April 10, 2026 / 08:14 PM IST

సీతంలో పోలిసెట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

VZM: సీతం కళాశాలలో ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్న ఉచిత పోలిసెట్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా.. ఇవాళ విద్యార్థులకు పోలిసెట్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బొత్స అనూష హాజరయ్యారు. సంస్థ అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

April 10, 2026 / 08:14 PM IST

భారీ ధర పలికిన ఫెర్రీ వేలంపాట

ELR: గోదావరి నదిపై రుద్రంకోట – కూనవరం మధ్య ప్రయాణికులను చేరవేసే ఫెర్రీ నిర్వహణ హక్కులకు శుక్రవారం భారీ ధర పలికింది. కూనవరం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలంలో తెల్లపల్లికి చెందిన రాజమ్మ రూ. 89.30 లక్షలకు పాట పాడి హక్కులను దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వానికి రూ. 10.70 లక్షల అదనపు ఆదాయం లభించింది.

April 10, 2026 / 08:12 PM IST

ఘనంగా ఏకలవ్య సంఘం వార్షికోత్సవం

W.G: అత్తిలి మండలం పాలూరులో ఏకలవ్య సంఘం 12వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘానికి చెందిన 12 మంది విద్యార్థులకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు గ్రామ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణంరాజు తెలిపారు. ఈ విద్యార్థుల్లో పదో తరగతి నుండి ఎంబీఏ చదివే విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

April 10, 2026 / 08:11 PM IST