NDL: డోన్ -నంద్యాలకు బస్సులను నడపాలని BJP జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఆర్టీసీ డిపో మేనేజర్ చలపతికి వినతి పత్రాన్ని ఇవాళ అందించారు. ఈ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం 2,3 ఎక్స్ప్రెస్ బస్సులు తిరిగేలా చూడాలన్నారు. బస్టాండ్లో చలివేంద్రాలు, బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, జీపీఎస్ లైవ్ లొకేషన్ సదుపాయం కల్పించాలన్నారు.
ATP: CM చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దశమహా విద్య హోమాలు నిర్వహిస్తున్నారు. ఆరవ రోజు నిర్వహించిన చిన్నమస్తా దేవి హోమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి టీజీ భరత్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
KDP: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలుగుదేశం మహిళా ప్రజాప్రతినిధుల బృందం రాజధానికి చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఈ బృందంలో కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో జరిగే చర్చలను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఎన్నో రోజులుగా కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, మట్టిని గురువారం పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. దోమల వ్యాప్తి పెరిగి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గుర్తించిన స్థానికులు అధికారులకు తెలియజేయడంతో నేడు కాలువలను శుభ్రం చేశారు. చెప్పగానే స్పందించిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక, ఆదాయం-ఖర్చులు, చేపట్టిన కార్యక్రమాలు, రాబోయే కార్యక్రమాలను వివరించారు. రెడ్ క్రాస్ నూతన కార్యవర్గ ఎన్నికలను వాయిదా వేశారు.
VSP: భీమిలి ఆర్డీవో కార్యాలయంలో జనగణన కార్యక్రమాన్ని ఇవాళ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజల సమగ్ర సమాచారం ఉంటేనే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతాయని అన్నారు. మొబైల్ ద్వారా స్వీయ గణన పూర్తి చేసి పొందిన ఐడీని ఎన్యూమరేటర్లకు ఇవ్వాలని సూచించారు.
KRNL: జిల్లాలో అకాల వర్షం పడుతోంది. తుగ్గలి, సి. బెలగళ్, గోనెగండ్ల, తదితర మండలాల్లో సాయంత్రం నుంచి వాన కురుస్తోంది. గోనెగండ్ల సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ వద్ద ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎమ్మిగనూరు – కర్నూల్ ప్రధాన రహదారిపై విద్యుత్ తీగలు పడడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది.
AKP: ఉపాధి కార్మికుల పొట్ట కొట్టడానికే కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ పథకాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో ఉపాధి కార్మికులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు పూటలా ముఖ ఆధారిత హాజరు కాకుండా ఒక్క పూటే తీసుకోవాలన్నారు.
బాపట్ల పురపాలక సంఘానికి స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలక పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతానికి అధికారులు కృష్ణి చేయాలన్నారు.
CTR: చిత్తూరు 1 టౌన్ పోలీసులు అదృశ్యమైన ఇద్దరు మైనర్ బాలికల కేసును 48 గంటల్లోనే ఛేదించి, వారిని సురక్షితంగా రక్షించారు. సోషల్ మీడియా పరిచయాలతో బాలికలు వెళ్లినట్లు విచారణలో తేలింది. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సకాలంలో స్పందించిన పోలీసులను బాధితుల తల్లిదండ్రులు అభినందించారు.
గుంటూరు: అమరావతి అసెంబ్లీ భవన్లో గురువారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయన సమీక్షించారు. ఇతర సభ్యులతో కలిసి ప్రభుత్వపరమైన పలు విషయాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ASR: పాడేరు మండలం కందమామిడి జీటీడబ్ల్యూఏ బాలికల పాఠశాలలో ప్రపంచ కళాదినం సందర్భంగా చిత్రలేఖన పోటీలు గురువారం నిర్వహించారు. ఈ పోటీలలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 6 నుంచి 9వ తరగతి వరకు సుమారు 30 మంది విద్యార్థినులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ జనపరెడ్డి అప్పారావు స్వఖర్చులతో బహుమతులు అందజేశారు.
మార్కాపురంలో ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఓ గుర్తుతెలియని మహిళను బలంగా ఢీ కొట్టడంతో మహిళ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆవుల బెడద ఎక్కువైందని పలుమార్లు వార్తా కథనాలు ఇచ్చిన.. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థలం మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగింది.
ATP: తాడిపత్రి మున్సిపాలిటీలో ఓ ఉన్నతాధికారి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీచక పర్వంపై సమగ్ర విచారణ జరిపి, సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాంగ్ రూట్ ప్రయాణాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.