CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం అమావాస్య సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించారు. తర్వాత మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించి పూజలు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
KRNL: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చల్లా ఓబులేసును నియమితులయ్యారు. గుంటూరులో అడిషనల్ కమిషనర్గా ఉన్న ఆయనను పదోన్నతిపై కర్నూలుకు బదిలీ చేశారు. అలాగే నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న జి.శ్రీనివాసులు పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. కాగా, కొత్త కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
కాకినాడలో నివాసముండే బుజ్జి అనే మహిళ 15 ఏళ్ల బాలికకు నగదు ఆశచూపి బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టింది. బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న బాలికను తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కాకినాడ 3వ పట్టణ పోలీసులు నిందితురాలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
VZM: ఇటీవల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళలలను లోవర్చుకోవడం తదితర చట్టాలపై ఎస్.కోట పట్టణ ఎస్సై పలు పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ఎవరైనా దాడులు చేస్తే స్వీయ రక్షణతో తిప్పి కొట్టాలని సూచించారు. ఆనంతరం విద్యార్థులకు చట్టాలపై క్విజ్ నిర్వహించారు. అందులో గెలుపొందిన వారికి పెన్నులు, బుక్స్ పంపిణీ చేశారు.
గుంటూరు: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని AT అగ్రహారం ప్రాంతంలో రహస్యంగా నడుస్తున్న వ్యభిచార దందాను పోలీసులు ఛేదించారు. రెండో లైన్లోని ఓ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని SHO సత్యనారాయణ హెచ్చరించారు.
ATP: రాప్తాడు మైనార్టీ కాలనీలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు స్త్రీరక్ష పోర్టల్, శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు. గృహ హింస, సైబర్ నేరాలు, వేధింపుల నుంచి చట్టపరమైన రక్షణ ఎలా పొందాలో మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
E.G: రాజమండ్రి నగరంలోని మల్లయ్యపేట సబ్ స్టేషన్ పరిధిలో RDSS పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు EE నక్కపల్లి శామ్యూల్ గురువారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆనంద్ నగర్, పేపర్ మిల్ క్వార్టర్స్, రామకృష్ణ నగర్, ఇందిరానగర్, శానిటోరియం,వెంకటాపురం తదితర ప్రాంతాల్లో కోత ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
కోనసీమ: ఇంటర్ ఫలితాల్లో పాసర్లపూడికి చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు సాయివర్మ 981 మార్కులతో అద్భుత ప్రతిభ చాటాడు. ఏడాది క్రితం తల్లి పాముకాటుతో మరణించినా, ఆ విషాదాన్ని దిగమింగుకొని ప్రభుత్వ కళాశాలలో చదివి ఈ ఘనత సాధించాడు. గురువారం జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సాయివర్మను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఐఐటీలో చేరాలన్నదే తన ఆశయం అని విద్యార్థి అన్నారు.
పల్నాడు: వినుకొండ పట్టణం కొత్తపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల వినతులను నేరుగా స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులను తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యాలయం కోరింది.
VZM: చైన్ స్నాచింగ్ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని వంగర ఎస్సై షేక్ శంకర్ సూచించారు. గురువారం సాయంత్రం స్దానిక మడ్డువలస జంక్షన్ వద్ద వైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలు బహిరంగంగా ధరించకుండా జాగ్రత్త వహించాలన్నారు.
KDP: ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన కీర్తన ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ నెల 19 మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఈ పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అలాగే అలంఖాన్ పల్లెలో పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.
SKLM: ప్రతి పేదవాడికి 2029 నాటికి సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ. 900 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించి, అర్హులందరికీ పారదర్శకంగా గృహాలను అందిస్తుంది అని అన్నారు.
గుంటూరు: తెనాలి చెంచుపేటలో ఆన్లైన్ ద్వారా అసభ్య వీడియో కాల్స్ నిర్వహిస్తున్న రాకెట్ బయటపడింది. మహిళలను ఉపయోగించి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన మహిళ కుమారుడు పరారీలో ఉండగా గాలింపు కొనసాగుతోంది. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ప్రకాశం: జిల్లా కలెక్టర్ రాజబాబు నేడు పల్లె నిద్రకు మర్రిపూడి మండలం గుండ్లసముద్రం వస్తున్నట్లు తహశీల్దార్ జనార్ధన్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో జిల్లా స్థాయి అధికారులు పల్లె నిద్రకు వస్తున్నారన్నారు. జువ్విగుంట విద్యుత్ శాఖ ఎస్.ఈ, అంకెపల్లి డ్వామా పీడీ, మర్రిపూడి డీఆర్డీఏ పీడీ, అధికారులు వస్తున్నట్లు తెలిపారు.
తిరుపతి SVIMS శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్గా కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. కొండగుంట నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. డా. ఉషాకళావత్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆమె స్థానంలో నాగరాజును నియమించినట్లు స్విమ్స్ డైరెక్టర్ డా.ఆర్.వీ. కుమార్ తెలిపారు. నిబద్ధతతో పనిచేసి SVIMSకు ఆమె మంచి పేరు తెచ్చారని కొనియాడారు.