• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెద్ది ఈవెంట్ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

NTR: జూన్ 1న జరగనున్న ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించనున్న ఇందిరా గాంధీ స్టేడియం పరిసరాలను ఎంపీ కేశినేని చిన్ని,సెంట్రల్ ఏసీపీ దామోదర్ పోలీసు అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. సినీ ప్రముఖులు, వీఐపీలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

May 30, 2026 / 09:10 PM IST

స్ఫూర్తి భవన్‌లో జనరల్ బాడీ సమావేశం

ELR: సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో జూన్ 9న ఆర్.ఆర్.పేటలోని స్ఫూర్తి భవన్‌లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మతోన్మాద విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడేందుకు పార్టీ శ్రేణులను చైతన్యపరిచే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

May 30, 2026 / 09:09 PM IST

గుండెలపై చంద్రబాబు బొమ్మతో వీరాభిమాని

KDP: బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంటకు చెందిన బోడికే ఓబుల నాయుడు టీడీపీకి వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ.. గుండెలపై సీఎం చంద్రబాబు ఫొటోను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న ఆయనకు చంద్రబాబు కుటుంబంపై ప్రత్యేక అభిమానం ఉందని స్థానికులు చెబుతున్నారు.

May 30, 2026 / 09:06 PM IST

వైసీపీ బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ

AKP: ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్లను చేర్పించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి సూచించారు. శనివారం నక్కపల్లిలో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు. పార్టీ సానుభూతి ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలన్నారు.

May 30, 2026 / 09:03 PM IST

మట్టి కుప్పను తప్పించబోయి ఆటో డ్రైవర్ మృతి!

PLD: కారంపూడి రోడ్డుపై ఉన్న మట్టి కుప్పను తప్పించబోయి ఆటో పల్టీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. చినగార్లపాడుకు చెందిన కె. జానీ బాషా (24) కారంపూడి నుంచి వస్తుండగా బ్రహ్మనాయుడు కాలనీ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో కింద పడి తలకు బలమైన గాయాలు కావడంతో జానీ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

May 30, 2026 / 08:56 PM IST

పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో నాగరాజు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఓ స్థలానికి సంబంధించిన విషయంలో ఖాళీ చేయాలని అధికారులు ముందుగానే నాగరాజుకు నోటీసులు ఇచ్చారు. నాగరాజు పట్టించుకోకపోవడంతో అధికారులు బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా నాగరాజు ఆత్మహత్య ప్రయత్నించాడు.

May 30, 2026 / 08:50 PM IST

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలోని నూతన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. కూటమి నేతలు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నందిగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.

May 30, 2026 / 08:45 PM IST

బద్వేలులో పట్టపగలు ఇంట్లో దొంగతనం

KDP: బద్వేలులోని సిద్దవటం రోడ్డులో ఉన్న శివరామకృష్ణ నగర్ 5వ వీధిలో పట్టపగలు చోరీ జరిగింది. బి.నరసింహారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు సుమారు 16 తులాల బంగారం,రూ.1.85 లక్షల నగదు,వెండి వస్తువులను అపహరించినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

May 30, 2026 / 08:39 PM IST

పాలకొల్లులో దాసరికి నివాళి

W.G: పాలకొల్లులో దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయన కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, నటుడిగా, రచయితగా, శతాధిక చిత్రాల దర్శకుడిగా ఆయన సాధించిన ఘనతలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. తన సినిమాల ద్వారా సమాజంలోని లోపాలను ఎండగడుతూ రికార్డులు సాధించి, పాలకొల్లు కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.

May 30, 2026 / 08:39 PM IST

కొండపిలో గ్రంథాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి

ప్రకాశం: కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నూతన గ్రంధాలయ భవన నిర్మాణానికి మంత్రి స్వామి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 95 లక్షల వ్యయంతో ఈ గ్రంథాలయం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ గ్రంథాలయం అన్ని వసతులతో కొండేపికే ఒక తలమానికంగా నిలవనుందని మంత్రి అన్నారు.

May 30, 2026 / 08:37 PM IST

స్వర్ణ పంచాయతీలో డీఎల్‌డీవో అకస్మిక తనిఖీలు

BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో డీఎల్‌డీవో కే. పద్మావతి శనివారం తనిఖీ చేశారు. గ్రామపంచాయతీలో PGRSలో వచ్చిన కంప్లైంట్లను విచారణ చేసి అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే గ్రామ అభివృద్ధికి నిధులు ఎన్ని కేటాయించారు. జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

May 30, 2026 / 08:37 PM IST

మహిళల భద్రతపై పోలీసులు అవగాహన

ELR: పెదపాడు మండలం కొత్తముప్పారులో మహిళల భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో ‘శక్తి యాప్’ ఎలా ఉపయోగపడుతుందో ఎస్సై ఆర్. శ్రీనివాస్ వివరించారు. యాప్‌లోని SOS బటన్ నొక్కితే చాలు, జీపీఎస్ ద్వారా లొకేషన్ పోలీసులకు చేరుతుందన్నారు. కుటుంబ సభ్యులకు కూడా అలర్ట్ వెళ్లే ఈ యాప్, మహిళలకు రక్షణ కవచమని తెలిపారు.

May 30, 2026 / 08:35 PM IST

‘ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలి’

E.G: కొవ్వూరులో ‘సర్ ప్రోగ్రాం’ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా మాజీ MLA, కొవ్వూరు వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకట్రావు మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. గత ఎన్నికల ఓట్ల తీరును బట్టి ఓటర్ల జాబితాలో మార్పులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు.

May 30, 2026 / 08:30 PM IST

వట్టిచెరుకూరు భూ సమస్యకు పరిష్కారం

GNTR: శతాబ్దకాలంగా 22ఏ నిషేధిత జాబితాలో ఉండి భూ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వట్టిచెరుకూరు గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులును నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

May 30, 2026 / 08:30 PM IST

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: SP

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలువు నిచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు, రెవెన్యూశాఖలతో సమిష్టిగా పని చేయాలని ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆద్వర్యంలో నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని శనివారం జూమ్ కాన్ఫరెన్స నిర్వహించారు.

May 30, 2026 / 08:30 PM IST