సత్యసాయి: సోమందేపల్లి మండలం కేతగాని చెరువు గ్రామంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ ఫేస్ యాప్ ఫోటోను వ్యతిరేకిస్తూ మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్ ఇవ్వాలని, కూలీలకు పని ముట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NDL: ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ జాయింట్ సెక్రటరీగా ఆదివారం డోన్ ఎంవిఐ క్రాంతికుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సహచర అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ పదవితో MVIల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు.
NLR: కాకాణి పూజిత ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, మహిళా నేతలు వేమూరి రాధాకృష్ణపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళా గౌరవాన్ని దెబ్బతీశాయని, జర్నలిజం విలువలను దిగజార్చాయని పేర్కొన్నారు.
VZM: నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఆదివారం కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త సింగంపల్లి ఎర్నిబాబుకు వెలుగు డి.ఆర్.డి. ఏ ద్వారా మంజూరైన సుమారు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ను అందజేశారు.
కర్నూలు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలను రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలకు హాజరుకావాలని ఆమె కోరారు.
ప్రకాశం: పొదిలి మండలం పిచ్చిరెడ్డి తోట కాలనీలో సోమవారం సీఐ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డాన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అలానే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ప్రజలను హెచ్చరించారు.
గుంటూరు: దుగ్గిరాలలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తెనాలికి చెందిన నారేపాలెం నాగరాజు విజయవాడ కేశఖండన శాలలో పనిచేసేందుకు బైక్పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలికి గాయమైంది.
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో సోమవారం సాయంత్రం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను, వినతులను నేరుగా తెలియజేసి పరిష్కారం పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
ఎన్టీఆర్: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటమట ఎస్సై రేవతి ఆదివారం అర్ధరాత్రి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. మహానాడు జంక్షన్ వద్ద ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనాలను ఆపి పత్రాలు పరిశీలించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపేవారు, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రైవేట్ బస్సులను కూడా తనిఖీ చేశారు.
సత్యసాయి: రొళ్ల మండల నూతన ఎస్సైగా నరసింహుడు బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో కదిరి రూరల్ ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై గౌతమి పుట్టపర్తి వీఆర్కు బదిలీ కావడంతో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన ఎస్సై తెలిపారు.
KDP: పులివెందుల రూరల్ సీఐగా పనిచేస్తున్న సీతారామిరెడ్డి రెడ్డిని నంద్యాల డీటీసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో రూరల్ ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న శాంతిలాల్ను నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పులివెందుల ట్రాఫిక్ సీఐగా మంత్రాలయంలో పనిచేస్తున్న రామాంజులను నియమించారు. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
CTR: డీఈఈ సెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ ఒక ప్రటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పల్నాడు: జిల్లాలోని కొండవీడు కోటపై అటవీశాఖ ప్రత్యేకంగా నైట్ క్యాంపింగ్ను ప్రారంభించింది. టెంట్లలో రాత్రి బస, క్యాంప్ ఫైర్, మ్యూజికల్ నైట్, ఉదయపు సూర్యోదయ వీక్షణ వంటి ఆకర్షణలు ఉంటాయి. పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1000గా ఫీజు నిర్ణయించారు. ట్రెక్కింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలు కూడా ఏర్పాటు చేశారు.
తిరుపతి: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న తిరుపతి మహతి కళాక్షేత్రంలో విశేష ధార్మిక ప్రవచనం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువలు& ధార్మిక సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ప్రవచనం ఇవ్వనున్నారు.
ATP: పెన్నానది ఆక్రమణల ఆరోపణలపై తాడిపత్రి మాజీ మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ రక్షణ కోసం చేపట్టిన అభివృద్ధి పనులను ఆక్రమణలుగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పురావస్తు శాఖ అనుమతులతోనే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ పనులు చేపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.