• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తలుపులమ్మ తల్లి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన స్పీకర్

AKP: నర్సీపట్నం అయ్యన్న కాలనీలో తలుపులమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, 11వ వార్షిక జాతర మహోత్సవాల కరపత్రాలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఆవిష్కరించారు. ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభమై, 23న విగ్రహ ప్రతిష్ట, 28న జాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని స్పీకర్ ఆకాంక్షించారు.

April 13, 2026 / 02:40 PM IST

ఆళ్లగడ్డలో ఈ నెల 15న మండల సర్వసభ్య సమావేశం

NDL: ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 15వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు. ఎంపీపీ గజ్జల రాఘవేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు అందరూ తమ శాఖాలకు సంబంధించిన పూర్తి నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు.

April 13, 2026 / 02:26 PM IST

పెద్దకడబూరు నూతన తహశీల్దార్‌గా వలిభాషా

KRNL: పెద్దకడబూరు MROగా వలిభాషా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని ఆయన తెలిపారు. మండల పరిధిలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు.

April 13, 2026 / 02:20 PM IST

వీధి విక్రయదారులకు ఐడీ కార్డులు ఇవ్వాలి: AITUC

VSP: జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ప్రతినిధులు జోన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని విక్రయదారులకు గుర్తింపు కార్డులు, భద్రత సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

April 13, 2026 / 02:20 PM IST

వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలి: CPM

PPM: పూర్ణపాడు-లాబేసు వంతెన పనులను త్వరగగతిన పూర్తి చేయాలని సీపీఎం పార్టీ నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం కొమరాడ మండల కేంద్రంలో ఆయన ధర్నాను నిర్వహించారు. కూటమి నాయకులు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వంతెనను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.

April 13, 2026 / 02:16 PM IST

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన స్పీకర్

AKP: పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన లంక వరలక్ష్మికి మంజూరైన రూ.65,594 సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె కుమారుడు మహేష్‌కు సోమవారం అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఒక వరమని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

April 13, 2026 / 02:16 PM IST

రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్

VZM: ఎల్.కోట మండలం రొంగలవానిపాలెం గ్రామంలో రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇలాంటి దేవాలయాలు కేంద్రబిందువులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

April 13, 2026 / 02:10 PM IST

ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే తనిఖీలు

మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలోని రికార్డులను, హాజరు పట్టికను పరిశీలించారు. స్వయంగా రోగులను అడిగి రోగులకు డాక్టర్లు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వైద్యశాలకు వస్తున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.

April 13, 2026 / 02:10 PM IST

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి

SKLM: నందిగాం మండల నూతన అధ్యక్ష, కార్యదర్శులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది అని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు.

April 13, 2026 / 02:09 PM IST

బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహములను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, హాస్టల్లో అందిస్తున్న భోజనం, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను, భోజనశాల, వంట గదులను పరిశీలించారు.

April 13, 2026 / 02:00 PM IST

పాతపట్నంలో “కార్యకర్తే అధినేత” సమావేశం

SKLM: పాతపట్నం టీడీపీ కార్యాలయంలో “కార్యకర్తే అధినేత” కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సోమవారం ఈ సమావేశంలో ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలే టీడీపీకి బలం అని పేర్కొన్నారు ‘మై టీడీపీ’ యాప్‌‌ను కార్యకర్తలు ఇన్‌‌స్టాల్ చేసుకుని పార్టీ కార్యకలాపాలను అందులో అప్లోడ్ చేయాలని సూచించారు.

April 13, 2026 / 02:00 PM IST

బాధితులకు మంత్రి పయ్యావుల భరోసా

ATP: టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన, సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సామాన్యులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

April 13, 2026 / 02:00 PM IST

ఐటీ పెట్టుబడుల్లో బెంగళూరు ఫ‌స్ట్‌.. పోటీలోనే లేని విశాఖ

VSP: దేశ ఐటీ పెట్టుబడుల్లో 2026 తొలి త్రైమాసికంలో బెంగళూరు $823 మిలియన్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ ($538 మిలియన్), ముంబయి ($402 మిలియన్) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఐటీ హబ్‌గా ఎదగాల్సిన విశాఖపట్నం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో పెద్ద పెట్టుబడులు రాకపోవడం, స్థిరమైన పురోగతి లేకపోవడంతో ఏపీ ఐటీ రంగం వెనుకబడుతోంది.

April 13, 2026 / 01:42 PM IST

కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

ATP: గుత్తి వీరారెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

April 13, 2026 / 01:41 PM IST

‘మండల స్థాయి గ్రీవెన్స్ సద్వినియోగం చేసుకోవాలి’

ASR: ప్రతీ సోమవారం కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న మండలస్థాయి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రసాదరావు, తహసీల్దార్ మురళీ బాబు ప్రజలకు సూచించారు. కలెక్టర్ టీ.నిషాంతి ఆదేశాలతో, నేడు గ్రీవెన్స్ నిర్వహించామన్నారు. భూములు, రెవెన్యూ సమస్యలపై రెండు ఫిర్యాదులు అందాయన్నారు. సమస్యల పరిష్కారానికి వెంటనే కృషి చేస్తామన్నారు.

April 13, 2026 / 01:39 PM IST