KDP: ప్రతి ద్విచక్ర వాహనదారుడు లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని SI హారిక తెలిపారు. సిద్ధవటం గ్రామ శివారులోని మూలపల్లె క్రాస్ వద్ద గురువారం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. హెల్మెట్, వాహన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనదారులకు ఒక్కొ వాహనానికి రూ.185 చొప్పున జరిమానా విధించామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం అమావాస్య సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించారు. తర్వాత మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించి పూజలు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
E.G: రాజానగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు “పల్లె పండుగ 2.0 – మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లె బాట” కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా MLA బత్తుల బలరామకృష్ణ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను స్వీకరిస్తారు. విద్య, వైద్యం, రోడ్లు, నీరు, భూమి సమస్యలపై అర్జీలు తీసుకోనున్నారు.
శ్రీకాకుళం PSNM పాఠశాల ఆవరణలో ప్రతి రోజు ఉదయం 5:30 నుంచి 7:45 వరకు MMW బాక్సింగ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈ శిక్షణను కోచ్ కే. పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సీనియర్ బాక్సర్లు కూడా పాల్గొని జూనియర్లకు మార్గదర్శనం చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటూన్నారు.
TPT: శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజ టికెట్లలో మార్పులు చేశారు. రూ.500 టికెట్ రద్దు కాగా, రూ.750, రూ.1500, రూ.2500 కొనసాగుతాయి. రూ.5000 టికెట్ను రూ.6000కి పెంచారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు ప్రతి బుధవారం రూ.100కే సామూహిక రాహు-కేతు పూజ నిర్వహించనున్నారు. ఈ పూజలో ఒకేసారి సుమారు 2000 మందికి అవకాశం కల్పించనున్నారు.
KRNL: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చల్లా ఓబులేసును నియమితులయ్యారు. గుంటూరులో అడిషనల్ కమిషనర్గా ఉన్న ఆయనను పదోన్నతిపై కర్నూలుకు బదిలీ చేశారు. అలాగే నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న జి.శ్రీనివాసులు పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. కాగా, కొత్త కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
కాకినాడలో నివాసముండే బుజ్జి అనే మహిళ 15 ఏళ్ల బాలికకు నగదు ఆశచూపి బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టింది. బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న బాలికను తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కాకినాడ 3వ పట్టణ పోలీసులు నిందితురాలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
VZM: ఇటీవల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళలలను లోవర్చుకోవడం తదితర చట్టాలపై ఎస్.కోట పట్టణ ఎస్సై పలు పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ఎవరైనా దాడులు చేస్తే స్వీయ రక్షణతో తిప్పి కొట్టాలని సూచించారు. ఆనంతరం విద్యార్థులకు చట్టాలపై క్విజ్ నిర్వహించారు. అందులో గెలుపొందిన వారికి పెన్నులు, బుక్స్ పంపిణీ చేశారు.
SKLM: ఎచ్చెర్ల మండలంలో చేపల వేటపై రెండు నెలల నిషేధం అమల్లోకి రావడంతో సముద్ర తీరాలు నిర్మానుష్యంగా మారాయి. మత్స్యకారులు బోట్లను, వలలను సురక్షితంగా నిల్వ చేస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది చేపల ప్రయోజన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిషేధం అమలు చేస్తారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
గుంటూరు: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని AT అగ్రహారం ప్రాంతంలో రహస్యంగా నడుస్తున్న వ్యభిచార దందాను పోలీసులు ఛేదించారు. రెండో లైన్లోని ఓ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని SHO సత్యనారాయణ హెచ్చరించారు.
నెల్లూరు జిల్లాలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెండు రోజుల పర్యటన ఖరారైంది. రేపు (ఏప్రిల్ 17) ఉదయం పెంచలకోన చేరుకోనున్నారు. అక్కడ జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 18వ తేదీన శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగే సాగునీటి సలహా మండలి (IAB) సమావేశంలో పాల్గొన్నారు.
ATP: రాప్తాడు మైనార్టీ కాలనీలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు స్త్రీరక్ష పోర్టల్, శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు. గృహ హింస, సైబర్ నేరాలు, వేధింపుల నుంచి చట్టపరమైన రక్షణ ఎలా పొందాలో మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
E.G: రాజమండ్రి నగరంలోని మల్లయ్యపేట సబ్ స్టేషన్ పరిధిలో RDSS పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు EE నక్కపల్లి శామ్యూల్ గురువారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆనంద్ నగర్, పేపర్ మిల్ క్వార్టర్స్, రామకృష్ణ నగర్, ఇందిరానగర్, శానిటోరియం,వెంకటాపురం తదితర ప్రాంతాల్లో కోత ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
కోనసీమ: ఇంటర్ ఫలితాల్లో పాసర్లపూడికి చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు సాయివర్మ 981 మార్కులతో అద్భుత ప్రతిభ చాటాడు. ఏడాది క్రితం తల్లి పాముకాటుతో మరణించినా, ఆ విషాదాన్ని దిగమింగుకొని ప్రభుత్వ కళాశాలలో చదివి ఈ ఘనత సాధించాడు. గురువారం జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సాయివర్మను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఐఐటీలో చేరాలన్నదే తన ఆశయం అని విద్యార్థి అన్నారు.