• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు అక్రమ చొరబట్లపై మత్స్యకారుల సమావేశం

ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో మత్స్యకారుల సమావేశం ఇవాళ జరగనుంది. తమిళనాడుకు చెందిన జాలర్లు అక్రమంగా తమ సముద్ర ప్రాంతాల్లోకి ప్రవేశించి మరబోట్లతో తమ వలలు, బోట్లకు నష్టం చేస్తున్నారన్న సమస్యపై చర్చించనున్నారు. తిరుపతి, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మత్స్యకారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

April 6, 2026 / 07:09 AM IST

నేడు జిల్లా వ్యాప్తంగా ‘PGRS’ కార్యక్రమం

ELR: జిల్లా వ్యాప్తంగా ఇవాళ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా రావడమే కాకుండా, ‘మీకోసం’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

April 6, 2026 / 07:04 AM IST

నలుగురు విద్యుత్ ఆపరేటర్ల తొలగింపు

NDL: రుద్రవరం మండలం విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆపరేటర్లను ఉన్నతాధికారులు తొలగించినట్లు AE రాజశేఖర్ నిన్న తెలిపారు. ఎల్లావత్తుల సబ్ స్టేషన్ నుంచి హరి, చిన్నకంబలూరు నుంచి పెద్దిరెడ్డి, ఆలమూరు నుంచి నరసింహనాయక్, హరినగరం నుంచి ఆంజనేయులు అనే ఆపరేటర్లను తొలగించినట్లు తెలిపారు. వారంతా నకిలీ ధ్రువపత్రాలతో విధుల్లో చేరినట్లు వెల్లడించారు.

April 6, 2026 / 07:02 AM IST

రోడ్డు లేక గ్రామస్తుల అవస్థలు

ASR: అనంతగిరి మండలంలోని కాకరపాడు పీవీటీజీ గ్రామానికి బీటీ రోడ్డు పనులు ఏళ్లుగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మట్టి రోడ్డు దెబ్బతిని రాళ్లు తేలడంతో రాకపోకలు కష్టమయ్యాయి. అంబులెన్స్‌ సహా వాహనాలు గ్రామానికి చేరలేని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

April 6, 2026 / 07:00 AM IST

నేడు యథావిధిగా ‘PGRS’ కార్యక్రమం: కలెక్టర్

W.G: భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ఇవాళ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూరప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

April 6, 2026 / 07:00 AM IST

224 కేసులు.. రూ.46,660 జరిమానా

KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 224 మందిపై కేసులు నమోదు చేసి రూ.46,660 జరిమానా విధించారు. శిరస్త్రాణం లేకుండా, సీటు బెల్టు ధరిం చకుండా, పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.

April 6, 2026 / 07:00 AM IST

ఆగష్టు నెలాఖరుకి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తాం – మంత్రి

VZM: ఆగస్ట్‌ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.నారాయణ తెలిపారు. ఆదివారం బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ పేదల కోసం అధునాతన టెక్నాలజీతో టిడ్కో ఇళ్లను మంజూరు చేస్తే గత YCP ప్రభుత్వం రూ.3.60 లక్షల ఇళ్లను రద్దుచేసి మిగిలిన ఇళ్లను పూర్తి చేయలేదని విమర్శించారు.

April 6, 2026 / 06:49 AM IST

బినిగెరిలో ఆంజనేయస్వామి ఉత్సవాలు

KRNL: ఆస్పరి మండలం బినిగెరి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఉత్సవాలు ఈనెల 6 నుంచి 9 వరకు ఘనంగా జరుగనున్నాయి. 8న రథోత్సవం, 9న వసంతోత్సవం నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు ఆదివారం తెలిపారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

April 6, 2026 / 06:46 AM IST

యాడికిలో సీఎం కాన్వాయ్ రిహార్సల్స్

ATP: CM చంద్రబాబు సోమవారం యాడికిలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, కలెక్టర్ ఆనంద్ కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభా ప్రాంగణం, పెండేకల్లు రిజర్వాయర్ వరకు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బారికేడింగ్, అగ్నిమాపక చర్యలు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

April 6, 2026 / 06:43 AM IST

ఎమ్మెల్యే రమణమూర్తి నేటి పర్యటన వివరాలు

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి సోమవారం ఉ. 10 కు పోలాకి మండలం ఓది పాడు గ్రామంలో, నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత, చెరువుల పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. మ.3 కు సారవకోట మండలం తహశీల్దార్ కార్యాలయనికి శంకుస్థాపన చేస్తారు. సా. 4 కు జలుమూరు KG BV పాఠశాల అదనపు తరగతి గదుల భవనాలను ప్రారంభిస్తారు. అని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.

April 6, 2026 / 06:40 AM IST

నేటి నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం

కడప నగరంలోని నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో ఇవాళ నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జవాబుపత్రాలు జిల్లాకు వచ్చాయి. మొత్తంగా 1,95,674 జవాబు పత్రాలు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు DEO షంషుద్దీన్ తెలిపారు.

April 6, 2026 / 06:37 AM IST

భార్యతో గొడవ.. టవర్ ఎక్కిన భర్త

కోనసీమ: ఆలమూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ టర్నింగ్ వద్ద చీదల రామారావు అనే వ్యక్తి ఆదివారం భార్యతో గొడవపడి సమీపంలోని హైపవర్ కరెంట్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎస్సై నరేశ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రామారావును సురక్షితంగా కిందికి దింపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

April 6, 2026 / 06:37 AM IST

వల్లూరులో విగ్రహాలను ఆవిష్కరించిన వేగుళ్ల

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం వల్లూరులో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరా గాంధీల విగ్రహాలను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

April 6, 2026 / 06:31 AM IST

నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

కాకినాడ కలెక్టరేట్లోని సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1గం వరకు సమస్యలపై వినతులను స్వీకరిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా విధిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.

April 6, 2026 / 06:28 AM IST

పేకాట శివరం పై దాడి.. ముగ్గురు అరెస్ట్

E.G: గోపాలపురం మండల పరిధిలోని కోమటికుంట గ్రామ శివారులో ఆదివారం జూదం ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నాగేశ్వరనాయక్ ఆదివారం తెలిపారు. డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టి జూదం ఆడుతున్న వారిని గుర్తించారు. డ్రోన్‌ను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

April 6, 2026 / 06:27 AM IST