• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

లక్ష్మమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

KRNL: ఆదోనిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వెండి రథోత్సవం మే మొదటి వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జాతరకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను గురువారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. రథోత్సవం జరిగే మార్గంలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా పనులు పూర్తి చేయాలన్నారు.

April 16, 2026 / 10:24 AM IST

ఇంటర్ ఫెయిలైన వారికి ALERT

SKLM: మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ఆస్ఐఓ రేగా సురేశ్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి 27 మధ్య ఫీజు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. రీ వెరిఫికేషన్‌కు సైతం 20వ తేదీ నుంచి 27 మధ్య దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

April 16, 2026 / 10:23 AM IST

ఆర్యాపురం పరిధిలో విద్యుత్‌కి అంతరాయం

E.G: ఆర్యాపురం సబ్‌ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా గురువారం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. సీతంపేట, టీచర్స్ కాలనీ, ఈఎస్ఐ ఆస్పత్రి, కృష్ణనగర్, కొత్త రోడ్డు, స్వతంత్ర ఆస్పత్రి ప్రాంతాలు ప్రభావితమవుతాయి. పనులు పూర్తయ్యాక సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.

April 16, 2026 / 10:08 AM IST

సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా పిఠాపురం

KKD: పిఠాపురం పురపాలక సంఘానికి పదోన్నతి లభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. Dy. CM పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో సెకండరీ గ్రేడ్ నుంచి సెలక్షన్‌ గ్రేడ్ మున్సిపాలిటీగా పిఠాపురం అప్‌గ్రేడ్ అయింది. ఈ హోదాతో పట్టణ అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు కానున్నాయి. పవన్ కృషి పట్ల జనసేన నాయకులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 16, 2026 / 10:08 AM IST

భవన నిర్మాణ రంగ కార్మికులకు శుభవార్త

ELR: జిల్లాలో భవన నిర్మాణ రంగ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. భీమా పథకంలో నమోదైన కార్మికులకు వివాహ కానుక పథకం కింద రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 18-60 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులన్నారు.

April 16, 2026 / 10:04 AM IST

అహుడా అభివృద్ధికి కలెక్టర్ హామీ

ATP: అనంతపురం పట్టణ అభివృద్ధి సంస్థ (అహుడా) పరిధిలో అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆనంద్, అహుడా చైర్మన్ టీసీ వరుణ్ చర్చించారు. నగరంలో పింక్ టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టుల గురించి చైర్మన్ కలెక్టర్‌కు వివరించారు. అహుడా అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని, అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

April 16, 2026 / 10:01 AM IST

‘డ్రైవర్ నిద్రమత్తులో ఉండడవ వల్లే ప్రమాదం జరిగింది’

KRNL: మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బొలేరో డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగిందని వారు వివరించారు. నిద్ర మత్తులో కుడి సైడ్ వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టినట్లు వెల్లడించారు. సదరు వాహనానికి పర్మిట్ లేదన్నారు.

April 16, 2026 / 09:59 AM IST

వరుడిపై కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్

W.G: పాలకొల్లు పట్టణం క్రిస్టియన్ పేటకు చెందిన వరుడు చందక సాయికుమార్‌పై దాడికి పాల్పడిన గోగులమండ శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న వధువు ఇంటి వద్ద జరిగిన రిసెప్షన్ వేడుకలో శ్రీను తనపై కత్తితో దాడిచేసి గాయపరిచినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

April 16, 2026 / 09:58 AM IST

వీరశైవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: MP

కర్నూలులోని ఓ థియేటర్‌లో జరిగిన వీరశైవుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు బుధవారం మాట్లాడారు. వీరశైవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. వారిని ఓబీసీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంటులో చర్చిస్తానన్నారు. అనంతరం ఆయన బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 16, 2026 / 09:56 AM IST

తూర్పు పాలెంలో దొంగతనం.. నిదితుడు అరెస్ట్

ప్రకాశం: పొదిలి మండలం తూర్పు పాలెంలో దుండగుడు ఓ ఇంట్లోకి చొరబడి మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై రాజేష్ దర్యాప్తు చేపట్టారు. సమీప సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు నిందుతుడు ఫిరోజ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, నిందితుడికి 15 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు.

April 16, 2026 / 09:49 AM IST

నేడు ఎర్రగుంట్లకు రానున్న కలెక్టర్

KDP: ఎర్రగుంట్ల-ముద్దనూరు రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం రానున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురు భాస్కర్ రెడ్డి తెలిపారు. పాఠశాలలోని నిర్మిస్తున్న స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించేందుకు ఆయన వస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.

April 16, 2026 / 09:46 AM IST

మంట కలిసిన మానవత్వం.. 6నెలల పాపను..!

E.G: రాజమండ్రి రైల్వేస్టేషన్‌ వద్ద ఇటీవల గుర్తు తెలియని సుమారు 6 నెలల చిన్నారిని స్థానికులు గుర్తించి రెండో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఛైల్డ్‌ లైన్‌ 1098కు సమాచారం అందించడంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సిబ్బంది చిన్నారిని శిశు గృహకు చేర్చి సంరక్షిస్తున్నారు. ఈ పాప వివరాలు తెలిసిన వారు పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

April 16, 2026 / 09:46 AM IST

‘ పాప వివరాలు తెలిస్తే సంప్రదించండి’

E.G: రాజమండ్రి రైల్వేస్టేషన్‌ వద్ద ఇటీవల గుర్తు తెలియని సుమారు 6 నెలల చిన్నారిని స్థానికులు గుర్తించి రెండో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఛైల్డ్‌ లైన్‌ 1098కు సమాచారం అందించడంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సిబ్బంది చిన్నారిని శిశు గృహకు చేర్చి సంరక్షిస్తున్నారు. ఈ పాప వివరాలు తెలిసిన వారు పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

April 16, 2026 / 09:46 AM IST

జీలుగుమిల్లులో రేపు మెగా జాబ్ మేళా

ELR: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జీలుగుమిల్లి మండలం బర్రెంకలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 9:00 నుంచి జరిగే ఈ జాబ్ మేళాలో 16కి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10, ఇంటర్, ఐటిఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్, D/B/M/ఫార్మసీ చేసి, 18-35 వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.

April 16, 2026 / 09:46 AM IST

ఈ నెల 23న మండల సర్వసభ్య సమావేశం

BPT: ఈ నెల 23వ తేదీన బల్లికురవ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కుసుమకుమారి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుందని, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై మండల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని కోరారు. సమావేశానికి సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా రావాలని ఎంపీడీవో సూచించారు.

April 16, 2026 / 09:39 AM IST