WG: నరసాపురం మండలం పసలదీవిలో ఈ నెల 9న ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ పి. చంద్ర శేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఏఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు, గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
BPT: తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన రాజు అనే బాలుడు వేటపాలెంలో ప్రత్యక్షమయ్యాడు. వేటపాలెంకు చెందిన బాలగోపి అనే వ్యక్తికి రాజు రైల్వే స్టేషన్లో తారసపడి అన్నం పెట్టించమని అడిగాడు. అన్నం పెట్టిన తదుపరి రాజును వేటపాలెం ఎస్సై జనార్ధన్కు మంగళవారం అప్పగించాడు. రాజును ఆరా తీయగా తన తండ్రితో మంచిర్యాలలో ఉంటాడని చెప్పడంతో ఎస్సై అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
W.G: ఆచంట మండలం కొడమంచిలి పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సోమేశ్వరరావును మంగళవారం కూటమి నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఆయనకు వివరించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు కోరారు. స్పందించిన అధికారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
CTR: పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మంగళవారం అధికారులు, అర్చకులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గోపుర పనులు ఎంతవరకు వచ్చాయని ఈవో రమణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. శివాలయ గర్భగుడి పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలపై క్షుణ్ణంగా పరిశీలించారు.
అన్నమయ్య: రాష్ట్రంలో పెరుగుతున్న బస్సు ప్రమాదాలపై హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర సమీక్ష జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రమాదాల కారణాలు, రోడ్డు భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు.
ELR: లింగపాలెం మండల MRO నజిముల్లషా మంగళవారం ఒకటవ నెంబర్ రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ రేషన్ షాపులో ఇచ్చే బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయన్నారు. కార్డుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని డీలర్లకు వివరించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు.
TPT: గంగమ్మ జాతరల నెల ప్రారంభం కానుండటంతో తిరుపతి తాతయ్య గంగమ్మ ఆలయ బోర్డు ఛైర్మన్, అర్చకులు, అధికారులు జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జాతరల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. జాతరల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
PLD: నరసరావుపేట మండలం అర్వపల్లి గ్రామంలో మంగళవారం పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి పశువుల గల రైతులు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GNTR: అమరావతి సచివాలయంలో రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలను నివారించేందుకే హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భవిష్యత్తులో పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
KRNL: తుగ్గలి వ్యవసాయ కార్యాలయంలో ఉల్లి సాగుపై AO సురేష్ బాబు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పొలాల్లో నీరు నిల్వ ఉంటే ఉల్లిగడ్డలు కుళ్లే ప్రమాదం ఉందన్నారు. నీరు త్వరగా బయటకు వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉల్లితో పాటు అంతర్ పంటలు సాగు చేస్తే ఆదాయం పొందవచ్చని తెలియజేశారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో రైతులకు కూటమి ప్రభుత్వం జారీ చేసిన189 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 21 నెలల్లో రైతుల ప్రగతి ద్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో నేతలు రైతుల పాసుపుస్తకాలపై సొంత ఫోటోలను ముద్రించారని విమర్శించారు.
VSP: తాత్కాలిక ఉద్యోగులతో తక్కువ వేతనాలతో పని చేయించుకోవడం శ్రమ దోపిడీ అని, వారిని రెగ్యులరైజ్ చేయాలన్న హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీవేజ్ సహా లక్షలాది మంది ఉద్యోగులకు సమాన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు.
NDL: సిరివెళ్ల PHC మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించినట్లు డాక్టర్ ముఖేష్ కుమార్ తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషికి ఎన్ని సిరి సంపదలు ఉన్నా వాటిని అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృథా అని పేర్కొన్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అంటువ్యాధులు దరి చేరవని స్పష్టం చేశారు.
ప్రకాశం: మార్కాపురంలో ఎండ తీవ్రతతో ప్రధాన రహదారులు మొత్తం నిర్మానుషంగా మారిపోయింది. ఎప్పుడూ జనాలతో, పల్లె ప్రజలతో రద్దీగా ఉండే రోడ్లు, ప్రధాన ప్రాంతాలు ఒక్కసారిగా కాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం నుంచే తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రారంభమైన ఎండలు మూడు గంటలు అయ్యేసరికి ఉష్ణోగ్రత 41% డిగ్రీలు ఉండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే అల్లాడిపోతున్నారు.
సత్యసాయి: కదిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.