KDP: రాయచోటి మండలం దిగువ అబ్బవరంలో నీటి సమస్య అధికంగా ఉందని ఆదివారం ఆ గ్రామానికి చెందిన పలువురు మహిళలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి.. దిగువ అబ్బవరం గ్రామంలో నీటి ఎద్దడి అధికంగా ఉందని, ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.