విజయనగరం: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ నిర్మల పిలుపునిచ్చారు. శనివారం బొబ్బిలి పట్టణంలోని కోరాడ వీధిలో పోషకాహార మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు.