కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఆదివారం విశాఖపట్నం వాస్తవ్యులు రాయవరపు సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు భారీ విరాళం అందజేశారు. వాడపల్లి గ్రామంలో నూతనంగా చేపట్టబోయే 500 రూమ్ల విశ్రాంత గదులకు ప్రథమంగా ఒక రూమ్కు రూ. 15, 31, 000 దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా దాతలను ఘనంగా ఆలయ ఈఓ సత్కరించారు.