TPT: తిరుపతి పట్టణంలోని పద్మావతిపురంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుని భూమనపై ఆరోపణ చేస్తున్నారని చెప్పారు. తమ హయాంలో ఏ రకమైన కల్తీ జరగలేదని చెప్పారు. తమపై చేసిన ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధమని చాలెంజ్ విసిరారు.